ఫైనాన్స్ ఇన్ఫ్లుయన్సర్లపై నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన.. ఏమన్నారంటే..?
Finance Influencers: ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇన్ఫ్లుయన్సర్లు చాలా ఫేమస్ అయ్యారు. అయితే వీరిపై అనేక వార్తలు మార్కెట్లో అనేక వార్తలు వ్యాప్తిలో ఉన్నాయి. వీటిపై తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఫైనాన్స్ ఇన్ఫ్లుయన్సర్లను నియంత్రించే తాజాగా ప్రకటించారు. అయితే వారి నుంచి ఆర్థిక సలహాలను కోరేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విలేఖరుల సమావేశంలో హైలైట్ చేస్తూ ఇన్వెస్టర్లను హెచ్చరించారు. కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించుకోవడానికి ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు క్షుణ్ణంగా పరిశోధన చేయడం, సలహాలు పొందేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని నిర్మలమ్మ నొక్కి చెప్పారు.

సామాజిక ఇన్ఫ్లుయన్సర్లు, ఫైనాన్స్ ఇన్ఫ్లుయన్సర్లు అంటూ రెండు రకాలవారు ఉంటారు. అయితే వారి మాటలు విని గుడ్డిగా కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టవద్దని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరిలో బలమైన జాగ్రత్త అవసరం.. ఇందుకోసం వారు ఇచ్చే సలహాలను పాటించటానికి ముండు రెండు సార్లు కౌంటర్ చెకింగ్ చేసుకోవాలని ఆర్థిక మంత్రి హెచ్చరించారు. నకిలీ ఫైనాన్స్ యాప్ లను అరికట్టడానికి ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం ఆర్బీఐ నుంచి సహాయం తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.
ప్రస్తుతానికి ఫైనాన్స్ ఇన్ఫ్లుయన్సర్లను నియంత్రించటానికి ఎలాంటి ప్రతిపాదన లేదని.. అయితే ఇన్వెస్టర్లు తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నొక్కి చెప్పారు.


Click it and Unblock the Notifications