Nirmala Seetharaman: ఆర్బీఐ గవర్నర్, సెబీ చీఫ్‌లతో నిర్మలమ్మ మీటింగ్.. ఎన్నికల ముందు భేటీ ఎందుకో..?

Finance Minister: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు వచ్చే నెలలో ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ సహా సెబీ ఛైర్‌ పర్సన్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో బేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.

వడ్డీ రేట్ల గురించి చర్చించేందుకు వచ్చే నెలలో సెంట్రల్‌ బ్యాంక్‌ కమిటీ సమావేశం కానుంది. దీనికి ముందు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌.. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్‌ను కలిశారు. సెబీ ఛైర్‌పర్సన్ మధబి పూరీ బుచ్‌తో కూడా విడిగా సమావేశమైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం Xలో పోస్ట్ చేసింది.

Union Finance Minister had a meeting with RBI governer and Sebi chief

ఫిబ్రవరి 2023 నుంచి RBI బెంచ్‌మార్క్ వడ్డీ రేటును 6.5 శాతం ఎలివేటెడ్ స్థాయిలోనే ఉంచింది. కాగా ఆయా రంగాలు ప్రస్తుతం వడ్డీ రేట్ల తగ్గింపు కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ ఏప్రిల్ 3-5 మధ్య సమావేశం కానుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం సహా వృద్ధి టార్గెట్‌ను ఇందులో వివరించనున్నట్లు భావిస్తున్నారు.

మరోపక్క గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో భారతీయ ఈక్విటీ మార్కెట్లు అధిక అస్థిరతకు గురవుతున్నాయి. మార్చి 7న BSE బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 74,245 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకింది. ఇవాళ చూస్తే 72,101 దగ్గర ముగిసింది. ఈ సమయంలో రెండు సంస్థల అధినేతలతో ఆర్థిక మంత్రి మీటింగ్ ప్రత్యేకంగా నిలిచింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+