Union Budget 2026 Highlights: మోడీ 3.0 పాలనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదవ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇది ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, రైతులు, పేదల శ్రేయస్సుకు ప్రధాన దృష్టి పెట్టిన యువశక్తి బడ్జెట్ గా నిలుస్తోంది. లోక్సభలో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ మంత్రి.. భవిష్యత్ ఆర్థిక విధానాలపై స్పష్టమైన దిశను తెలిపారు. భారతదేశం త్వరలోనే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదగబోతోందన్నారు.
సీతారామన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2047 నాటికి భారత్ ప్రపంచ నాయకుల మధ్యలో ఉన్న ఆర్థిక శక్తిగా ఎదుతుందన్నారు. గత కొన్ని సంవత్సరాలలో 250 మిలియన్ల మంది పేదరికం నుండి బయటకు వచ్చారు. దేశీయ GDP 7 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. రైతులు, పేదలు, సాధారణ ప్రజల శ్రేయస్సును కుదుర్చడం, ఉద్యోగ అవకాశాలను సృష్టించడం, వ్యాపార రంగానికి మద్దతు ఇవ్వడం వంటి చర్యల ద్వారా ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు.

బడ్జెట్లో సీతారామన్ 10 ముఖ్య అంశాలను ప్రతిపాదించారు:
1. రెవెన్యూ లోటును తగ్గించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడం.
2. ఉత్పాదకత, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యత ఇవ్వడం.
3. ఉద్యోగాల సృష్టి, MSMEలను ప్రోత్సహించడం, వ్యాపార సంస్కరణల ద్వారా వృద్ధికి తోడ్పడటం.
4. ప్రభుత్వ పెట్టుబడుల ద్వారా దేశంలో వృద్ధిని ప్రోత్సహించడం.
5. EMS PLI పథకంకు రూ.40,000 కోట్ల వ్యయం కేటాయించడం.
6. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లో అరుదైన భూమి ఖనిజాల కోసం ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేయడం.
7. MSME గ్రోత్ ఫండ్ కోసం రూ.10,000 కోట్లు కేటాయించడం.
8. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 (ISM 2.0) ప్రారంభించడం, దేశీయ సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రోత్సాహం అందించడం.
9. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెట్టుబడులకు రూ.40 వేల కోట్ల సమగ్ర వ్యయం.
10. యువత, రైతులు, పేదల కోసం దీర్ఘకాలిక సంక్షేమ, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవలపై దృష్టి సారించడం.
సీతారామన్ ఈ బడ్జెట్ ద్వారా దేశీయ తయారీ సామర్థ్యాలను పెంపొందించడం, పేదలు, చిన్న పరిశ్రమలకు సహకారం ఇవ్వడం, అంతర్జాతీయ మార్కెట్లలో భారత స్థానం బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నగరాల ఆర్థిక కేంద్రాలను శక్తివంతంగా మార్చడం, పర్యావరణ పరిరక్షణతో రవాణా, జల మార్గాల విస్తరణ కూడా ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
క్తుప్తంగా చెప్పాలంటే Budget 2026-27 యువత, రైతులు, MSMEలు, దేశీయ పరిశ్రమలను ఒక సమగ్ర విధానంతో ప్రోత్సహించడానికి రూపొందించబడినది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక, ఉద్యోగాలు, పేదరిక తగ్గింపు, పరిశ్రమల అభివృద్ధి, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు పెట్టుబడుల గరిష్ట ప్రాధాన్యత ఇచ్చి భారత్ను గ్లోబల్ ఆర్థిక శక్తిగా మారుస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications