gst scam: ఇటీవల పలు రాష్ట్రాల్లో GST రిజిస్ట్రేషన్స్ స్కామ్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా మరోసారి ఈ తరహా ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో జరిగింది. కాగా ఓ నిరుద్యోగి ఈ స్కామ్ కు బాధితుడిగా మిగలడం గమనార్హం.
బులంద్షహర్ నివాసి దేవేంద్ర కుమార్ కు మార్చిలో ట్యాక్స్ నోటీసు వచ్చింది. దాని ప్రకారం 1.36 కోట్ల టర్నోవర్ ఉన్న తన కంపెనీకి సంబంధించి ప్రభుత్వానికి 24.61 లక్షలు బకాయిపడినట్లు అందులో ఉంది. వారం తర్వాత ఏప్రిల్ లో 1.16 కోట్ల టర్నోవర్ ఉన్న మరో సంస్థ విషయంలోనూ ఇదే తరహా నోటీసు అందుకున్నాడు. అయితే అతడికి కనీసం ఏ ఉద్యోగం కూడా లేక నెలల తరబడి నిరుద్యోగిగా ఉండటం విశేషం.

ఈ నోటీసులపై దేవేంద్ర కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండేళ్ల క్రితం తాను నోయిడాలో ఓ కంపెనీలో పనిచేసినట్లు చెప్పాడు. ఆ సమయంలో అక్కడి కాంట్రాక్టర్లు తన నుంచి ఆధార్, పాన్ కార్డులు తీసుకున్నారని తెలిపాడు. వాటిని దుర్వినియోగం చేసి కొత్త కంపెనీల GST రిజిస్ట్రేషన్స్ కోసం వాటిని వినియోగించి ఉండవచ్చిని గౌతమ్ బుద్ధ నగర్ పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశాడు.
"నేను చాలా పేదవాడిని. గతంలో నరౌరాలోని టౌన్షిప్ ప్రాజెక్ట్లో కూలీగా పని చేశాను. అక్కడ రోజు కూలీ దాదాపు 300. ఇప్పుడు నాకు ఆ పనీ లేదు. అలాంటి పరిస్థితుల్లో కోట్ల టర్నోవర్ ఉన్న రెండు కంపెనీలకు నేను ఎలా యజమానిని కాగలను?" అని దేవేంద్ర కుమార్ తన బాధను వ్యక్తం చేశారు. కేవలం FIRలు నమోదు చేసేందుకే ఇప్పటివరకు 40 వేలు ఖర్చు చేసినట్లు చెప్పాడు. కాగా ఈ వ్యవహారంపై విచారణ జరపనున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications