భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బంగారం ధర 10 గ్రాములకు కేవలం రూ. 88 మాత్రమే ఉండేది అంటే నమ్మగలరా.. ఈ విషయం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఈ రోజు అదే బంగారం వేల రెట్లు విలువైనదిగా మారింది. ఏకంగా లక్ష రూపాయలను దాటి పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తోంది. గత 78 సంవత్సరాల్లో దేశం రూపురేఖలు రంగు పూర్తిగా మారిపోయాయనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు. ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా భారత్ అవతరించింది. మరోవైపు సామాన్యుడి జీవితం కూడా పూర్తిగా మారిపోయింది. ఎంత మారినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది. ఈ మార్పును స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే అప్పట్లోని ధరలను ఇప్పటి ధరలతో పోల్చిచూడటం చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.
1947లో భారతదేశంలోని ప్రజలకు బంగారం అంటే ఒక సంపద మాత్రమే కాదు.. ఒక ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండేది. అప్పట్లో 10 గ్రాముల Gold ధర రూ. 88 ఉండేది. ఈ రోజు అదే Gold ధర రూ.లక్ష దాటింది. ఇక వెండి ధర కూడా అప్పట్లో కిలోకు రూ. 106 ఉండేది; ఇది ఇప్పుడు కిలోకు రూ. లక్షా 10 వేలకు పైగానే చేరింది. గత మూడు నాలుగు ఏళ్లలో ఒక్క వెండి ధరలోనే 30 శాతం వరకు పెరుగుదల నమోదైందని చెప్పవచ్చు.

ఇంకా విచిత్రకరమైన అంశంగా పెట్రోల్ ధరను చెప్పుకోవచ్చు. 1947లో లీటరు పెట్రోల్ ధర 25 నుండి 27 పైసల మధ్య వినియోగదారులకు దొరికేది. ఆ సమయంలో బైక్లు, కార్లు చాలా అరుదుగా ఉండేవి. ఈ తరంలో లీటరు పెట్రోల్ ధర దాదాపు రూ. 95గా ఉంది. ఇదే విధంగా బియ్యం ధర కూడా ఇప్పటికీ చాలా మారింది. 1947లో బియ్యం ధర క్వింటాలుకు రూ.10 నుండి రూ.16 మధ్య ఉండేది. అంటే కిలో బియ్యం రూ.0.10 నుండి రూ.0.16 మధ్యే ఉండేది. ప్రస్తుతం మంచి బియ్యం ఒక్క కిలో ధర కనీసం రూ.60గా పైనే ఉంది.
అప్పట్లో ఒక గుడ్డు కేవలం 2-4 పైసలకే లభించేంది . ఇప్పుడు మాత్రం ఒక గుడ్డు ధర రూ.8 నుంచి 10 రూపాయలు పలుకుతోంది. ఆవ నూనె కూడా అప్పట్లో కిలోకు 15-20 పైసులకే లభించేది. ప్రస్తుతం ఆవ నూనే కాదు కదా.. ఏ తినదగిన నూనె అయినా సరే లీటరు రూ.180-రూ. 200 పెడితే కాని దొరకడం లేదు. బంగాళాదుంపలు అప్పట్లో క్వింటాలుకు రూ.నుంచి 5 రూపాయలు పలుకగా ఇప్పుడు అదే బంగాళాదుంపలు కిలోకు రూ.30-రూ. 40 వరకు పలుకుతున్నాయి.
ధరలతో పాటు ఆదాయ స్థాయి కూడా అప్పటిలాగే మారిపోయింది. స్వాతంత్ర్యం దశలో తలసరి వార్షిక ఆదాయం కేవలం రూ.230-రూ.250. అంటే నెలకు రూ.20 నుంచి రూ25 మాత్రమే. అప్పట్లో ఉద్యోగ అవకాశాలు స్వల్పం కావడంతో అనేకమంది రైతులుగా లేదా రోజువారీ కూలీలుగా జీవించేవారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు నెలలకు రూ.50-రూ. 150 వరకు సంపాదించేవారు. ఇది అప్పటి పరిస్థితిలో చాలా పెద్ద మొత్తంగా కనిపించేంది.
రిటైల్ ద్రవ్యోల్బణ రేటు కూడా 10 శాతం దాటిన పరిస్థితి కనిపిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం ప్రభావం, ఆహార కొరత వల్ల ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉండేవి. అయితే దేశం స్వాతంత్య్రాన్ని పొందిన తర్వాత నెమ్మదిగా ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి, పరిశ్రమలు ఏర్పడ్డాయి. అయినా ఇప్పటికి 1 USD విలువ దాదాపు రూ.86 పలుకుతోంది.
1947లో అదే డాలర్ విలువ 3.3 రూపాయలు మాత్రమే. అప్పుడు భారతదేశ GDP దాదాపు 900 మిలియన్ USD ఉండేది. ఈ రోజు అదే దేశం GDP సుమారు 4 ట్రిలియన్ USDగా ఉంది. 78 ఏళ్లలో భారత్ తన దారి ఎలా మార్చుకుంది, ఒక అభివృద్ధి చెందిన సమాజంగా ఎగసి వెలసిందనే విషయానికి ఇది ఏకైక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.
More From GoodReturns

Strait of Hormuz: భారత్కు అమెరికా బంపర్ ఆఫర్.. చమురు సంక్షోభం నుంచి భారత్ సేఫ్..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?



Click it and Unblock the Notifications