Brahmos: మన పురాణాల్లో బ్రహ్మాస్త్రం గురించి చాలామంది వినే ఉంటారు. దాదాపు అటువంటిదే మన దేశం దగ్గరున్న బ్రహ్మోస్ మిసైల్. ఏళ్ల తరబడి అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ కొనసాగుతూ వస్తోంది. అయితే ఈ పరిస్థితిని మార్చడానికి మోదీ సర్కారు ఆత్మనిర్భర భారత్ ను తీసుకొచ్చింది. తద్వారా కొంతమేర ఆయుధ దిగుమతులు తగ్గడమే కాకుండా, ఎగుమతులూ ఊపందుకున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ మధ్య దాదాపు ఏడాదిగా జరుగుతున్న యుద్ధం వల్ల ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. అయితే ఉద్రిక్తతలు సృష్టించి ఆ మంటల్లో చలికాచుకునే పాశ్చాత్య దేశాలు.. ఈ యుద్ధం మరింత కాలం కొనసాగించేలా ఉక్రెయిన్ ను ప్రేరేపిస్తున్నట్లు పలు నివేదికలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ యద్ధం కాస్తా ఆయుధాల టెస్టింగ్ ఫీల్డ్ గా తయారైనట్లు నిపుణులు అభివర్ణిస్తున్నారు.

ఈ టెస్టింగ్ ఫీల్డ్ లో రష్యా పలు క్షిపణులను ఉక్రెయిన్ పై ప్రయోగిస్తోంది. అయితే ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా అదేస్థాయిలో వాటిని ప్రతిఘటిస్తూ, మట్టి కరిపిస్తూ వస్తోంది. కానీ ఉక్రెయిన్ ఎదుర్కోలేని ఏకైక మిసైల్ బ్రహ్మోస్ అని వినికిడి. బ్రహ్మోస్ సత్తా ప్రత్యక్షంగా చూసిన ఉక్రెయిన్.. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సహా రాడార్స్ కి కూడా అందనంత వేగంతో ఈ మిసైల్ దూసుకొస్తున్నట్లు చెప్తోంది.
తాజా పరిణామంతో ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మోస్ పవర్ ప్రత్యక్షంగా తెలిసి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ దెబ్బతో మరిన్ని దేశాలు.. బ్రహ్మోస్ కొనుగోలుకు ఆసక్తి చూపించవచ్చని అంచనా. అయితే ఆఫ్రికా దేశాలకు రక్షణ ఎగుమతులను పెంచుకోవాలని చూసే భారత్ కు ఇది కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.
రష్యా-భారత్ జాయింట్ గా తయారు చేసిన ఈ మిసైల్.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదిగా చెబుతుంటారు. అందుకే చైనా ఆగడాలను కట్టడి చేయాలని భావించే పలు దేశాలు బ్రహ్మోస్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ఫిలిప్పైన్స్ తో డీల్ పక్కా అయింది. కాగా వియత్నాం, ఇండొనేషియాలతో చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనా అగ్ర రాజ్యాలు అందుకోలేని ఫీట్ భారత్ సాధించడం నిజంగా గ్రేట్ కదూ..


Click it and Unblock the Notifications