కొత్తగా జారీ చేసే హెచ్-1బి వీసాల (H-1B Visa)లపై ఫీజును అమెరికా లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ ట్రంప్ కీలక ప్రకటన చేసిన సంగతి విదితమే. ఈ ప్రకటన భారతీయులు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అయితే ఇదే సమయంలో యూకే.. భారతీయులకు గుడ్ న్యూస్ అందించింది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించిన వివరాల ప్రకారం.. ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, డిజిటల్ నిపుణులకు వీసా ఫీజులను రద్దు చేసే ప్రతిపాదనలపై ప్రధాని కీర్ స్టార్మర్ యోచిస్తున్నట్లు తెలుప్తోంది.
యూకేలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, డిజిటల్ నిపుణుల వీసా రుసుములను రద్దు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారని FT కథనం పేర్కొంది. ముఖ్యంగా, ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాల నుండి వచ్చిన వ్యక్తులు లేదా ప్రతిష్టాత్మక అవార్డు గ్రహీతలకు వీసా ఖర్చులను మాఫీ చేయడం వంటి ఎంపికలను గ్లోబల్ టాలెంట్ టాస్క్ ఫోర్స్ అన్వేషిస్తోంది.

ప్రస్తుతం UK లో గ్లోబల్ టాలెంట్ వీసా దరఖాస్తుదారునికి 766 పౌండ్లు ఖర్చవుతుంది, అలాగే భాగస్వాములు, పిల్లలు కూడా ఇదే రుసుము చెల్లిస్తారు. అదనంగా, వార్షిక ఆరోగ్య సర్ఛార్జ్ 1,035 పౌండ్లుగా ఉంటుంది. 2020లో ప్రారంభమైన ఈ వీసా మార్గం, సైన్స్, ఇంజనీరింగ్, మెడిసిన్, హ్యూమానిటీస్, డిజిటల్ టెక్నాలజీ, కళలు, సంస్కృతి రంగాల్లో గుర్తింపు పొందిన వ్యక్తుల కోసం రూపొందించబడింది.
టాస్క్ ఫోర్స్ లో వ్యాపార సలహాదారు వరుణ్ చంద్ర, సైన్స్ మంత్రి లార్డ్ పాట్రిక్ వాలెన్స్ అధ్యక్షత వహిస్తున్నారు. హోం ఆఫీస్ ఇప్పటి వరకు అధికారిక ప్రతిపాదనలను ప్రకటించకపోయినా, వీసా మార్గాలను సమీక్షలో ఉంచినట్లు అధికారులు ధృవీకరించారు. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇది నికర వలసలను తగ్గించడం కాదు, కానీ బ్రిటన్కు అత్యంత ప్రతిభావంతులను ఆకర్షించడం గురించి అంటూ స్పష్టం చేశారు.
ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. టాప్ ఐదు విశ్వవిద్యాలయాల నుండి వచ్చిన లేదా ప్రతిష్టాత్మక అవార్డులను పొందిన వ్యక్తులకు వీసా ఖర్చులను పూర్తిగా మాఫీ చేయడానికి ఆలోచనలు జరుగుతున్నాయి. ఈ నిర్ణయం, అమెరికా H-1B visa fees కు సమాంతరంగా, బ్రిటన్ను ప్రపంచంలోని ప్రతిభావంతుల ఆకర్షణ కేంద్రంగా మార్చే ప్రయత్నంగా తీసుకుంటున్నారని తెలిపింది. సైన్స్, పరిశోధన, టెక్నాలజీ రంగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన ప్రతిభను UK ఆకర్షించగలగడమే దీని ఉద్దేశమని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలకు కేంద్రం అవ్వడం సహాయపడుతుంది. జూన్ 2023తో ముగిసిన సంవత్సరంలో, గ్లోబల్ టాలెంట్ వీసాల సంఖ్య 76 శాతం పెరిగి 3,901కి చేరిందని తన కథనంలో తెలిపింది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications