Akshata Murthy: ఇన్ఫోసిస్ నుంచి అక్షతాకు ఆదాయం.. ఎన్ని కోట్లంటే
Akshata Murthy: UK ప్రధమ మహిళగా ఉన్న అక్షతా మూర్తికి ఇన్ఫోసిస్ నుంచి వస్తున్న ఆదాయం గతం నుంచి పెద్ద వివాదమే. భారతదేశపు రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్ లో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ భార్యకు వాటాలు ఉన్నాయి. ఇవి రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది.
డివిడెండ్ ఆదాయం..
దేశీయ టెక్ కంపెనీ నుంచి అక్షతా మూర్తి తనకు ఉన్న వాటాల ద్వారా 2022లో రూ.126.61 కోట్ల డివిడెండ్ ఆదాయాన్ని పొందారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె సెప్టెంబరు చివరి నాటికి ఇన్ఫోసిస్లో 3.89 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీ మెుత్తం షేర్లలో 0.93 శాతానికి సమానం.
స్టాక్ మార్కెట్..
అక్షతా మూర్తి ప్రస్తుతం పెట్టుబడుల విలువ ఇన్ఫోసిస్ లో రూ.5,956 కోట్లు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ స్టాక్ ధర ఉదయం 10.20 గంటలకు NSEలో రూ.1,526గా ఉంది. మే 31న 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.16 ఫైనల్ డివిడెండ్ చెల్లించింది. ఈ నెలలో సంస్థ రూ.16.5 మధ్యంతర డివిడెండ్ను కూడా ప్రకటించింది. ఈ రెండు కలుపుకుంటే.. ఒక్కో షేరుకు రూ.32.50 చొప్పున రూ.126.61 కోట్ల ఆదాయాన్ని అక్షతా అందుకున్నారు.
గతంలో ఆదాయం..
దేశంలో అత్యుత్తమ డివిడెండ్ చెల్లిస్తున్న కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. ఇది 2021లో ఒక్కో షేరుకు మొత్తం రూ.30 డివిడెండ్ని చెల్లించింది. అప్పట్లో ఆమె రూ.119.50 కోట్లను డివిడెండ్ ఆదాయంగా అందుకున్నారు.
తలనొప్పిగా వ్యవహారం..
రిషి సునర్క బ్రిటీష్ జాతీయుడు కాగా.. ఆయన భార్య అక్షతా మూర్తి మాత్రం భారతీయ పౌరురాలు. అయితే బ్రిటన్లో 15 సంవత్సరాల వరకు పన్నులు చెల్లించకుండా విదేశాల్లో డబ్బు సంపాదించడానికి అనుమతించే ఆమె నాన్ రెసిడెంట్ యూకేలో పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే.
టాక్స్ చెల్లిస్తానని..
కానీ.. ఆమె ఎల్లప్పుడూ తన UK ఆదాయంపై అక్కడ పన్నులు చెల్లిస్తూనే వచ్చారు అక్షతా మూర్తి. వివాదం ముదరటంతో బ్రిటిష్ సెన్స్ ఆఫ్ ఫెయిర్నెస్ ద్వారా తనకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సంపాదనపై యూకేలో పన్ను చెల్లిస్తానని ప్రకటించారు.