Aadhaar News: అన్ని చోట్ల ఆధార్ వివరాలు ఇస్తున్నారా..? మీ డేటా సేఫేనా..
Aadhaar News: ఈరోజుల్లో ఏ పని చేసుకోవాలన్నా తప్పనిసరికా కావాల్సిన డాక్యుమెంట్లలో కీలకమైనదిగా ఆధార్ కార్డు మారిపోయింది. దీనివల్ల పనులు సులభతరం అయ్యాయి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేసుకోవాలన్నా లేక ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి.
ఏ పనిచేసుకోవాలన్నా.. అనేక చోట్ల ప్రజలు తమ ఆధార్ కార్డు వివరాలను అందిచాల్సి వస్తోంది. అయితే ఇలా ఆధార్ను ఉపయోగిస్తున్నప్పుడు వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం కలుగుతుందని చాలా మంది భావిస్తున్నారు. అయితే దీనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, UIDAI మాజీ ఛైర్మన్ నందన్ నీలేకని సమాధానం ఇచ్చారు.

ఎవరైనా తమ ఆధార్ నంబర్ను వెల్లడించినప్పుడు సదరు స్థలాలు లావాదేవీలకు సంబంధించిన మొత్తం డేటాకు సెంట్రల్ స్టోరేజ్ హబ్ లేదని నీలేకని తెలిపారు. అందువల్ల ఏ అవసరం కోసం మనం ఆధార్ వివరాలను పంచుకున్నామో అవి అక్కడికే పరిమితం అవుతాయని ఇతర సంస్థలకు తెలియదని వెల్లడించారు. ఉదాహరణకు మీరు మెడికల్ అవసరం కోసం ఆధార్ వివరాలు అందిస్తే.. అవి మీ ఆధార్ అనుసంధానమైన బ్యాంక్ కు తెలియవన్నారు.
ఆధార్ వివరాలను అన్ని చోట్ల నుంచి సెంట్రల్ డేటా బేస్ కు రాకుండా ఎవరి సర్వర్లలో వారు ఉంచుతారు కాబట్టి గోప్యతకు ప్రమాదం ఉండదని నీలేకని తెలిపారు. పైగా ప్రజలు ఆధార్ ఎలా ఉపయోగించబడుతుందనే దానిపై ఎటువంటి డేటాను సేకరించడం లేదని స్పష్టం చేశారు. ఒక దగ్గర ఆధార్ అందించినప్పుడు.. మీరు దానితో వేరేచోట్ల ఏమి చేసారో ఇతర సిస్టమ్కు తెలియదని, అందువల్ల డేటా సురక్షితంగా ఉంటుందని తెలిపారు. అయినప్పటికీ డిజిటల్ యుగంలో గోప్యత, సైబర్ సెక్యూరిటీ పట్ల ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు.


Click it and Unblock the Notifications