కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ ఒక్క రోజులో భారీ నష్టపోయారు. కోటక్ మహీంద్రా బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షాలు విధించింది. ఆన్ లైన్ ఖాతాలు ఓపెన్ చేయకూడదని అలాగే కొత్త క్రెడిట్ కార్డులను ఇష్యు చేయకూడదని స్పష్టం చేసింది. దీంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ గురువారం భారీగా పతనమైంది. దాదాపు 11 శాత వరకు పడిపోయింది. దీంతో ఉదయ్ కోటక్ తన ఆస్తిలో 1.3 బిలియన్లు కోల్పోయారు.
అంటే మన భారత కరెన్సీ ప్రకారం ఉదయ్ రూ.10225 కోట్లు నష్టపోయాడు. ఉదయ్ కోటక్ కు కోటక్ మహీంద్రా బ్యాంక్లో 25.71 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్యాంక్ స్టాక్ గురువారం దాదాపు 10.85 శాతం పతనంతో రూ.1643 వద్ద ముగిసింది. ఏప్రిల్ 24, 2024న కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.3,66,383 కోట్లుగా ఉంది. ఇది గురువారం నాటికి రూ.326,615 కోట్లకు తగ్గింది. అంటే ఒక్క సెషన్లో మార్కెట్ క్యాప్ రూ.39,768 కోట్లు క్షీణించింది.

ఈ స్టాక్ పతనం కారణంగా ఉదయ్ కోటక్ షేర్ హోల్డింగ్ మార్కెట్ విలువ రూ.10225 కోట్లు తగ్గింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ పతనం కారణంగా బ్యాంక్ వాటాదారులైన మ్యూచువల్ ఫండ్స్ మరియు బీమా కంపెనీలు కూడా నష్టపోయాయి. ఎల్ఐసీ దాదాపు రూ.2570 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఆర్బీఐ చర్యలతో పలు బ్రోకరేజ్ లు కోటక్ మహీంద్రా బ్యాంక్ టార్గెట్ ప్రైస్ ను సవరించాయి. శుక్రవారం కూడా కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ దాదాపు 1 శాతం పడిపోయింది.
అయితే త్వరలో కోటక్ మహీంద్రా బ్యాంకులో ఆర్బీఐ అడిట్ నిర్వహించే అవకాశం. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన తప్పులను సవరించుకుంటే ఆంక్షాలు ఎత్తివేసే అవకాశం ఉంది. దీంతో అప్పటి వరకు స్టాక్ పై ఎలాంటి అంచనాకు రాలేమని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications