Adani Debts: అదానీ గ్రూప్ కంపెనీల అప్పుల విషయం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. దీనిపై బ్యాంకింగ్ రంగంలో పెద్ద చర్చే జరుగుతోంది. తాము అదానీ గ్రూప్ కంపెనీలకు అప్పులిస్తామని కొందరు అంటుండగా.. ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని మరికొందరు అంటున్నారు. ఇక ఈపీఎఫ్ఓ, ఎల్ఐసీ లాంటి సంస్థలైతే తాము పెట్టుబడులను కొనసాగిస్తామని ఇప్పటికే స్పష్టమైన ప్రకటనలు చేశాయి.
ఈ క్రమంలో తాజాగా ఇదే విషయంపై యూకో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సోమ శంకర ప్రసాద్ స్పందించారు. తాము అదానీ గ్రూప్తో వ్యాపారాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. అయితే అదానీ ప్రాజెక్టులు లాభదాయకమైనవని తేలితే ముందుగు వెళతామని స్పష్టం చేశారు. ఎలాంటి కారణం లేకుండా కమర్షియల్గా మంచి ఆదాయాన్ని అందించే ప్రాజెక్టులకు ఎందుకు అప్పులు ఇవ్వకూడదో చెప్పాలన్నారు.

దీనికి ముందు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా సైతం అదానీ కంపెనీలకు అప్పులిచ్చే విషయంలో ఇలాంటి వైఖరిని వెల్లడించింది. ఇదే సమయంలో అమెరికా బ్యాంకింగ్ సంక్షోభంపై ప్రసాద్ మాట్లాడారు. గ్లోబల్ బ్యాంకింగ్ సంక్షోభం ప్రభావం భారత్ పై ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే.. దేశీయ బ్యాంకులు దాదాపు 90-95 శాతం వరకు రిటైల్ డిపాజిట్లపై ఆధారపడి ఉన్నాయని ఆయన వెల్లడించారు. వీరంతా దేశవ్యాప్తంగా విస్తరించిఉన్న చిన్న డిపాజిటర్లని అందువల్ల ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల పరిస్థితిపై ఎలాంటి సందేహం అక్కర్లేదని అన్నారు.
హిండెన్ బర్గ్ అదానీ రుణాలపై, అకౌంటింగ్ పద్ధతులపై చేసిన ఆరోపణలు కంపెనీ షేర్లను పాతాళానికి నెట్టాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ ఆఫ్ షోర్ డీల్స్ వ్యవహారంలో సెబీ దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన వేళ నేడు మార్కెట్లలో అదానీ గ్రూప్ కంపెనీలు మళ్లీ డీలా పడ్డాయి. ఇన్వెస్టర్లు అమ్మకానికి ఎక్కువగా మెుగ్గు చూపటంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications