అమెరికాకు శాపంగా మారిన ట్రంప్ నిర్ణయాలు, ఆర్థిక మాంద్యంతో విలవిల.. ఎంతలా అంటే..

అమెరికాలో ఆర్థికమాంద్యం ముప్పు మరోసారి చర్చనీయాంశంగా మారింది. మూడీస్ అనలిటిక్స్ చీఫ్ ఎకనామిస్ట్ మార్క్ జాండి ఇటీవల యుఎస్ recession మీద ఒక హెచ్చరిక విడుదల చేశారు. ఆయన ప్రకారం అమెరికా జిడిపిలో మూడింట ఒక వంతు వాటా కలిగిన రాష్ట్రాలు ఇప్పటికే మాంద్యంలో ఉన్నాయని, లేదా మాంద్యం 'అధిక ప్రమాదం'కు చేరుకున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా మాంద్యం ప్రభావం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మిడ్‌వెస్ట్, రస్ట్ బెల్ట్ ప్రాంతాలకు చెందిన రాష్ట్రాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయాయి. ఇది పారిశ్రామిక, వ్యవసాయ రంగాలపై ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తోందని హెచ్చరించారు.

మార్క్ జాండి ఫైనాన్షియల్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. అమెరికాలోని వివిధ ప్రాంతాలలో ఆర్థిక మాంద్యం సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూయార్క్ వంటి పెద్ద రాష్ట్రాలు మాత్రమే కొంచెం స్థిరంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మూడు రాష్ట్రాలు కలిపి అమెరికా జిడిపిలో మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు జాతీయ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన భాగంగా నిలుస్తున్నాయి.

US economy recession Mark Zandi recession warning Moody s economic forecast US economic slowdown recession risk 2025 job market weakness inflation impact economic downturn Moody s chief economist US financial outlook 2025

ఈ ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రధానంగా వ్యవసాయం, తయారీ, నిర్మాణం రంగాల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ రంగాలు ప్రత్యేకంగా గ్రామీణ, పారిశ్రామిక ప్రాంతాలలో తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ట్రంప్ పరిపాలనలో తాజా సుంకాలు విధించడం.. అలాగే ఇతర దేశాల ప్రతిస్పందన చర్యలు ఈ రంగాలపై మరింత పతనానికి కారణమవుతున్నాయని మార్క్ జాండి పేర్కొన్నారు. వాషింగ్టన్ DC ఆర్థిక వ్యవస్థ కూడా భారీ కోతల కారణంగా మందగింపును అనుభవిస్తోందన్నారు.

అయితే ఆరోగ్య సంరక్షణ, సాంకేతికత, రియల్ ఎస్టేట్ రంగాలు ఇప్పటికీ అభివృద్ధి మార్గంలో ఉన్నాయంటూ మార్క్ జాండి వెల్లడించారు. ఆర్థిక సేవలు, రిటైల్, ఆతిథ్యం రంగాలు కూడా నిరంతర ఆదాయంతో ముందుకు సాగుతున్నాయని చెప్పుకొచ్చారు. US మాంద్యంలో ఉందా అన్న ప్రశ్నకు మార్క్ జాండి ఒక స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు.

నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (NBER) ప్రకారం.. వరుసగా రెండు త్రైమాసికాల GDP ప్రతికూల వృద్ధి మాంద్య సూచిక. అయితే, రెండవ త్రైమాసికంలో GDP పెరుగుదల ఉండటంతో, అమెరికా సాంకేతికంగా మాంద్యాన్ని దాటి ముందుకు పోయింది. అయినప్పటికీ మాంద్య ముప్పు పూర్తిగా తీరలేదని మూడీస్ చీఫ్ ఎకనామిస్ట్ హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, పెట్టుబడిదారులు, వ్యాపారులు, పాలకులు జాగ్రత్తగా ఆర్థిక పరిస్థితులను గమనిస్తూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మార్క్ జాండి సూచించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్న ఈ సమయంలో అమెరికా కూడా మాంద్య సంకేతాలను పూర్తిగా అర్థం చేసుకుని ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉందని చెబుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+