ఆర్బీఐ సంచలన విషయాలను వెల్లడించింది. వ్యవస్థలో ఇంకా రూ.2000 నోట్లు మూలుగుతున్నాయని తెలిపింది. నోట్ల రద్దు జరిగినా ఇంకా ప్రజల మధ్యనే రెండు వేల నోట్లు ఉన్నాయని తాజా రిపోర్టులో తెలిపింది. మే 19, 2023న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. రెండు వేల రూపాయిల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుని దాదాపు రెండు సంవత్సరాలు గడిచిపోయింది.
అయినప్పటికీ రెండు వేల రూపాయల నోట్ల రద్దు జరిగి రెండేళ్లు గడిచినా ఇంకా ప్రజల దగ్గర ఆర్బీఐ నోట్లు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక స్పష్టం చేసింది. ఇంకా ప్రజల దగ్గర రూ.6,181 కోట్ల విలువైన గల రూ.2000 నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

నోట్ల రద్దు సమయానికి అంటే మే 19, 2023వ తేదీ నాటికి మొత్తం చెలామణిలో ఉన్న రెండు వేల నోట్ల విలువ మార్కెట్లో రూ.3.56 లక్షల కోట్లుగా ఉంది. అయితే ఈ విలువ మే 31 2025 నాటికి రూ.6,181 కోట్లకు తగ్గిందని RBI తన తాజా నివేదికలో వెల్లడించింది. గతంలోనే నోట్ల మార్పిడికి అవకాశం అవకాశం ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్. అక్టోబర్ 7, 2023 వరకు అన్ని బ్యాంకు శాఖలలో ఈ నోట్లను మార్పిడి చేసుకోవచ్చని సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ 19 ఇష్యూ కార్యాలయాలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.ఈ కార్యాలయాలు ఇప్పటికీ ఎవరి దగ్గరైనా నోట్లు ఉంటే వారు ఆ రెండు వేల నోట్లను బ్యాంక్ ఖాతాలలో జమచేయడానికి అంగీకరిస్తున్నాయి. ప్రజలు దేశంలోని ఏ పోస్టాఫీసు నుండైనా, ఆర్బీఐ జారీ చేసిన ఏ కార్యాలయానికైనా ఇండియా పోస్ట్ ద్వారా రూ. 2000 నోట్లను పంపించవచ్చు. వారు మీ ఖాతాలో ఈ నగదును జమ చేస్తారు. అయితే రూ. 2 వేల నోటును రద్దుచేసినా అది ఇంకా చట్టబద్దమైన ద్రవ్యంగానే కొనసాగుతోంది.
బ్యాంకులు, ఏటీఎం సెంటర్లు దీనిని జారీ చేయనప్పటికీ అధికారికంగా వీటిని ప్రజలు చెల్లింపు ప్రయోజనాల కోసం వినియోగించవచ్చు. ఆర్బీఐ జారీ చేసిన నివేదిక ప్రకారం.. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో 19 ఆర్బీఐ కార్యాలయాల్లో రెండు వేల రూపాయల నోట్లను మార్పిడి చేసుకోవచ్చు. అక్కడకు వెళ్లలేని వారు ఆ కార్యాలయాలకు పోస్ట్ ద్వారా మీ నోట్లను పంపించినా సరిపోతుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications