Twitter: ఎలాన్ మస్క్ చేతికొచ్చిన తరువాత సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో పెను మార్పులు జరిగిన విషయం తెలిసిందే. యాడ్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రాంను స్టార్ట్ చేయడం అందులో ఒకటి. దీని ద్వారా కంటెంట్ క్రియేటర్స్కు ఆదాయాన్ని షేర్ చేయనున్నట్లు సంస్థ అధినేత మస్క్ గతంలో ప్రకటించారు. కాగా క్రియేటర్స్ ఇప్పుడు ఆ ప్రోగ్రాం ఫలాలు అందుకుంటున్నారు.
ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన క్రియేటర్స్ అధిక మొత్తంలో ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. రచయిత బ్రియాన్ క్రాస్సెన్స్టెయిన్కు 7.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా 18.23 లక్షలు, 1.7 మిలియన్ల ఫాలోయింగ్ కలిగిన రాజకీయ వ్యాఖ్యాత బెన్నీ జాన్సన్ 7.16 లక్షలు సంపాదించారు. ఈ మొత్తాన్ని స్ట్రైప్ ద్వారా ట్విట్టర్ పేమెంట్ చేయనుంది.

ఈ యాడ్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రాంకు అందరూ అర్హలు కారు. అకౌంట్ మానిటైజేషన్ కావాలంటే ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉండటం తప్పనిసరి. ప్రతినెలా 5 మిలియన్ల కంటే ఎక్కువ ట్వీట్ ఇంప్రెషన్లు చొప్పున 3 నెలలపాటు పొందిన కంటెంట్ క్రియేటర్స్ ఇందుకు అర్హులు.
ట్విట్టర్ కంటెంట్ మోనిటైజేషన్ ప్రమాణాలను క్రియేటర్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లైంగిక, పిరమిడ్ స్కీమ్స్, తక్కువ కాలంలో ధనవంతులయ్యే పథకాలు, హింస, నేరాలు, జూదం, మాదకద్రవ్యాలు వంటి విభాగాలపై నిషేధం ఉంది. ఫిబ్రవరిలో ఈ ప్రోగ్రాం గురించి మస్క్ ప్రకటించారు. మొదటి విడతలో 37.5 కోట్ల యాడ్ రెవెన్యూని క్రియేటర్స్కు షేర్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. కాగా అదిప్పుడు అమలవుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications