Bluesky: ట్విట్టర్ ను ఎట్టకేలకు సొంతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు ఆ ఆనందం రోజులు గడవక ముందే ఆవిరైపోతోంది. ఆయనకు సరైన పోటీ ఇచ్చే మెునగాళ్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చేశారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడే మస్క్ కు పోటీదారుగా నిలవటం హీట్ పుట్టిస్తోంది.
సరికొత్త సోషల్ నెట్వర్క్..
ట్విట్టర్ ను వీడిన మాజీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే కొత్త సోషల్ నెట్వర్క్ను ప్రారంభిస్తున్నారు. బ్లూస్కై పేరుతో దానిని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. దీనిని బ్లాక్ చెయిన టెక్నాలజీ ఆధారంగా తయారు చేసినట్లు వెల్లడించారు. ఇదొక డీసెంట్రలైజ్డ్ సోషల్ నెట్ వర్క్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది బీటా టెస్టింగ్ స్థితిలో ఉందని, త్వరలోనే Bluesky ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

నయా సాంకేతకత..
కొత్తగా వస్తున్న ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ వినియోగించే "AT Protocol" సాంకేతికత పెద్ద బలం అని తెలుస్తోంది. ఇది వినియోగదారులను ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు వెళ్లేందుకు దోహదపడుతుందని జాక్ డోర్సే తెలిపారు. ఇది గట్టిపోటీని ఇస్తుందని ఆయన నమ్మకంగా ఉన్నారు.

2019లో ప్రాజెక్ట్..
ట్విట్టర్ 2019లో డోర్సే నాయకత్వంలో బ్లూస్కైపై పనిచేయడం ప్రారంభమైంది. వికేంద్రీకృత సోషల్ నెట్వర్క్ ప్రోటోకాల్ను రూపొందించడం, వివిధ సామాజిక ప్లాట్ఫారమ్లు కలిసి పనిచేయడానికి వీలు కల్పించడమే దీని లక్ష్యంగా ఉంది. ఇది సపరేట్ సంస్థగా ఏర్పాటు చేయబడినప్పటికీ.. నిధుల కోసం ఇప్పటికీ ట్విట్టర్ పై ఆధారపడి ఉందని తెలుస్తోంది. అలా ఇప్పటి వరకు మెుత్తం 13 మిలియన్ డాలర్లను ఈ ప్రాజెక్ట్ అందుకుంది. మస్క్ దీనికి నిధులు ఆపేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

నెజిజన్ల రియాక్షన్..
Jack Dorsey ట్విట్టర్ వేధికగా తన ప్లాన్ గురించి వెల్లడించటంతో చాలా మంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని, తాము ఇందులో జాయిన్ అవుతామని వారు కామెంట్స్ చేయటం ట్విట్టర్ కు గట్టి పోటీ ఇస్తుందని తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications