Twitter: ట్విట్టర్ ఇండియా ఆఫీసుల మూసివేత.. సంచలన నిర్ణయం తీసుకున్న మస్క్..

Twitter: ట్విట్టర్ కంపెనీని ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత అంతా అల్లకల్లోలం జరుగుతోంది. ఇంతకు ముందు అమెరికాలో ఆఫీసుల్లోని ఫర్నిచర్ అమ్మటం, ఆఫీసులకు అద్దె చెల్లించకపోటం, ఉద్యోగులను భారీగా తొలగించటం వంటి నిర్ణయాలతో ఎలాన్ మస్క్ సంచలనం సృష్టించారు.

ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి వెనుక అసలు కారణం ఖర్చులను తగ్గించుకోవటం అని తెలుస్తోంది. అయితే తాజాగా ఇదే ఫార్ములాను ఇండియాలోనూ అమలు చేస్తున్నాడు బిలియనీర్ మస్క్. తాజాగా ఇండియాలో ఉన్న మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల కంపెనీకి ముంబై, ఢిల్లీలో ఉన్న రెండు ఆఫీసులు ఇక మూతపడనున్నాయి. ఈ కార్యాలయాల్లో కేవలం ముగ్గురు ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నట్లు సమాచారం.

Twitter closing its Mumbai, Delhi offices to cut costs under Elon musk managment

ప్రస్తుతం ట్విట్టర్ కంపెనీకి ఇండియాలో తొలగింపుల తర్వాత తక్కువ మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. అందుకే ఖర్చులను తగ్గించే చర్యల్లో భాగంగా రెండు కార్యాలయాలను మస్క్ మూసివేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులను ఇకపై ఇంటి వద్ద నుంచే పనిచేయాలని ట్విట్టర్ సూచించింది.

ట్విట్టర్ కు బెంగళూరులో ఉన్న కార్యాలయం మాత్రం కొనసాగనుందని తెలుస్తోంది. ఇక్కడ పనిచేసే ఇంజనీర్లు నేరుగా US కార్యాలయానికి నేరుగా రిపోర్ట్ చేస్తారు. 44 బిలియన్ డాలర్లకు కంపెనీని మస్క్ కొనుగోలు చేసిన తర్వాత వారాల వ్యవధిలోనే దాదాపు 7500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+