న్యూఢిల్లీ: కొంతకాలంగా దేశంలో వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తోన్న టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్.. వైఖరికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఉప రాష్ట్రపతి ముప్పవరకు వెంకయ్య నాయుడు వినియోగిస్తోన్న వ్యక్తిగత అకౌంట్కు సంబంధించిన బ్లూ టిక్ను తొలగించిన నేపథ్యంలో.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం.. కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ట్విట్టర్ యాజమాన్యానికి తుది నోటీసులను జారీ చేసింది. వెంకయ్య నాయుడు అకౌంట్కు సంబంధించిన బ్లూ టిక్ను ట్విట్టర్ పునరుద్ధరించినప్పటికీ.. కేంద్రం మాత్రం వెనకడుగు వేయలేదు.
దేశంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మార్గదర్శకాలన్నీ కిందటి నెల 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. వాట్సప్, ఫేస్బుక్ వాటిని అనుసరిస్తోన్నాయి. కొత్త మార్గదర్శకాలకు లోబడి కార్యకలాపాలను కొనసాగిస్తామని ప్రకటించాయి. ట్విట్టర్ మాత్రం విభేదించింది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ రూపొందించిన కొత్త మార్గదర్శకాలను అనుసరించడానికి మొండికేస్తోంది. యధాతథంగా తన కార్యకలాపాలను దేశంలో కొనసాగిస్తోంది.

ఈ నేపథ్యంలో- కొత్త మార్గదర్శకాలను అనుసరించడంపై సమాచార మంత్రిత్వ శాఖ ట్విట్టర్ యాజమాన్యానికి తుది నోటీసులను జారీ చేసింది. ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79 కింద ట్విట్టర్ యాజమాన్యానికి చివరి అవకాశాన్ని ఇస్తోన్నామని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రిత్వ శాఖ నోటీసులను జారీ చేసింది. ఈ నిబంధనలకు అనుగుణంగా ట్విట్టర్ యాజమాన్యం భారత్లో ఒక చీఫ్ కంప్లయన్సెస్ అధికారి, ఒక నోడల్ అధికారి, ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేకంగా మరో గ్రీవెన్స్ అధికారిని నియమించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఇటాంటి చర్యలేవీ ట్విట్టర్ యాజమాన్యం చేపట్టలేదు.
ఈ వ్యవహారం మొత్తాన్నీ సమీక్షించడానికి కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సారథ్యంలో ఇదివరకే ఏర్పాటైన ప్యానెల్ శుక్రవారమే సమావేశమైంది. కమ్యూనికేషన్లు, న్యాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. దీనికి అనుగుణంగా ఆ మరుసటి రోజే ట్విట్టర్ యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వం తాఖీదులను జారీ చేసింది. ఐటీ చట్టం (ఇంటర్మీడియట్లీ గైడ్లైన్సెస్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021కు లోబడి ఉండేలా అంగీకరిస్తారా? లేదా అనేది స్పష్టం చేయాలని ఆదేశించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications