పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక ఆర్థిక, ఇంధన, ఉపాధి సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా భావిస్తున్న బీమా రంగం, అణుశక్తి రంగం, ఉపాధి హామీ పథకం, పాత చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లులు వరుసగా ఆమోదం పొందాయి.
దేశంలో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) 100 శాతం వరకు అనుమతిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన సబ్కా బీమా సబ్కా రక్షా (బీమా చట్టాల సవరణ) బిల్లు-2025'కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును మంగళవారం లోక్సభ ఆమోదించగా, బుధవారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం వరకు మాత్రమే ఎఫ్డీఐలకు అనుమతి ఉండగా.. ఈ బిల్లు ద్వారా ఆ పరిమితిని పూర్తిగా తొలగించనున్నారు.
రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రతిపక్షం సూచించిన సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. బిల్లును మరింత సమగ్రంగా పరిశీలించేందుకు పార్లమెంటరీ కమిటీకి పంపాలని విపక్షాలు కోరినప్పటికీ, ప్రభుత్వం ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు.

బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. ప్రజలకు మేలు చేకూరేలా బీమా రంగంలో మరిన్ని సంస్కరణలు రాబోతున్నాయని తెలిపారు. విదేశీ కంపెనీల పెట్టుబడులతో ఈ రంగం మరింత విస్తరిస్తుందని, తక్కువ ప్రీమియంతో చౌకైన పాలసీలు అందుబాటులోకి వస్తాయని ఆమె చెప్పారు. పోటీ పెరగడం వల్ల కొత్త ఉత్పత్తులు, వినూత్న పాలసీలు రావడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు.
దీంతో పాటుగా అణుశక్తి రంగంలో చారిత్రక మార్పుకు బాటలు వేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన సస్టైనబుల్ హార్నెసింగ్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (శాంతి) బిల్లును లోక్సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా అణు ఇంధన రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి పూర్తిస్థాయి అనుమతి లభించనుంది. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు వాకౌట్ చేసినప్పటికీ.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సభలో మాట్లాడుతూ, ప్రైవేట్ రంగం రావడం వల్ల అణుశక్తి రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.
ఇక గ్రామీణ ఉపాధి వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్-గ్రామీణ (వీబీ-జీ రామ్ జీ) బిల్లుపై లోక్సభలో చర్చ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ఈ బిల్లు ద్వారా గ్రామీణ కూలీలకు ప్రతిఏటా 125 రోజుల ఉపాధి లభిస్తుందని చెప్పారు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలన్న మహాత్మాగాంధీ కల నెరవేరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఉపాధి హామీ పథకం నుంచి గాంధీజీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఇక కాలం చెల్లిన చట్టాలను తొలగించే దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిపీలింగ్ అమెండ్మెంట్ బిల్లు-2025కు కూడా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా 71 పాత చట్టాలను రద్దు చేయనున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications