Andhra Pradesh: సీఎం జగన్ను కలిసిన టీవీఎస్ మోటర్ ఎండీ.. టూరిజం అభివృద్ధికి..
Andhra Pradesh: పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఇన్వెస్టర్లకు రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి మంత్రులు వెల్లడిస్తున్నారు. వచ్చే నెలలో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ క్రమంలో టీవీఎస్ మోటర్ కంపెనీ ఎండీ సుదర్శన్ వేణు ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది.

వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఏపీ టూరిజం కాఫీ టేబుల్ బుక్స్ను ఆవిష్కరించారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నేపథ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్లు, సోల్స్ స్పేస్, ఏ టూ జెడ్ టేబుల్ గైడ్పై ప్రత్యేక పుస్తకాలను ఏపీ ప్రభుత్వం ప్రచురించింది. వీటిని ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్ భాషల్లో ప్రచురించటం జరిగింది. వీటిని ఎయిర్పోర్ట్ లాంజ్లు, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, టూరిజం సెంటర్స్లో వీటిని అందుబాటులో ఉండనున్నారు.

ఇన్వెస్టర్లకు ఏపీలో ఉన్న పెట్టుబడి అనుకూల వాతావరణం గురించి వీటిలో ప్రత్యేక కథనాలు ఉండనున్నాయి. ఏపీ ప్రభుత్వ టూరిజం శాఖ.. బెస్ట్ టూరిజం పాలసీ అవార్డును కైవసం చేసుకున్న తరుణంలో ఇతర రాష్ట్రాల కూడా మనను అధ్యయనం చేస్తున్నాయని సీఎంకు వెల్లడించారు. రానున్న రోజుల్లో టూరిజం డెస్టినేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.


Click it and Unblock the Notifications


