Trump Towers: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలియనివారు ఉండరు. ఆయన యాజమాన్యంలో ఇండియాలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న 'ద ట్రంప్ ఆర్గనైజేషన్' కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. గుర్గావ్ కేంద్రంగా ఉన్న ట్రిబెకా డెవలపర్స్తో దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. 2023లోపు కనీసం రెండు నిర్మాణాలను ప్రారంభించాలని ట్రంప్ సంస్థ యోచిస్తోంది.

భారత రియల్టీ మార్కెట్..
ఈ క్రమంలో ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, అమెరికా అధ్యక్షుడి కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్రిబెకా వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతాను కలిశారు. తాను భారత రియల్టీ మార్కెట్ పై చాలా బుల్లిష్గా ఉన్నట్లు ట్రంప్ జూనియర్ ప్రముఖ వార్తా సంస్థకు వెల్లడించారు. అమెరికా బయట వారికి భారత్ అతిపెద్ద మార్కెట్ అని ఆయన పేర్కొన్నారు.

దశాబ్దకాలంగా..
ట్రంప్ జూనియర్తో మెహతాకు దశాబ్దకాలంగా అనుబంధం ఉంది. ట్రంప్ టవర్లను భారతదేశానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. పైప్ లైన్ లో ఉన్న 5 ప్రాజెక్టులను వచ్చే ఏడాదిలోపు ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ క్రమంలో రూ.2,500 కోట్లను ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రారంభించే 3-5 స్థిరాస్తి ప్రాజెక్టులపై వెచ్చించనున్నట్లు మెహతా తెలిపారు. గతంలో పూణే, దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ట్రంప్ టవర్స్ ను ట్రిబెకా అభివృద్ధి చేసింది.

హైదరాబాద్ లో నిర్మాణం..
రాబోయే ట్రంప్ ప్రాజెక్ట్లలో అల్ట్రా-లగ్జరీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు కాకుండా రెండు సంస్థలు వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లను కూడా అన్వేషిస్తున్నాయి. వాటిలో కనీసం ఒకటి పూణేలో ప్లాన్ చేయబడింది. దీనికి తోడు ట్రంప్ ప్రాజెక్ట్లు హైదరాబాద్, బెంగళూరు, లూథియానా, చండీగఢ్ వంటి మార్కెట్లలో ఉండనున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో ట్రంప్ బ్రాండ్ ప్రాపర్టీలను డెలివరీ చేయడానికి ట్రిబెకా బాధ్యత వహిస్తోంది. అయితే ట్రంప్ సంస్థ దాని నైపుణ్యాన్ని ఈ నిర్మాణాలకు అందించటంతో పాటు నిర్మాణాల నాణ్యతను నిర్ధారిస్తుంది.

రానున్న 12 నెలల్లో..
అమెరికా మార్కెట్లలో తప్ప ఇతర దేశాల్లో ట్రంప్ సంస్థ నేరుగా ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టదు. అందుకే కల్పేశ్ మెహతా నేతృత్వంలోని ట్రైబెకా డెవలపర్స్తో గత పదేళ్లుగా భారత్లో ప్రత్యేక లైసెన్సు అగ్రిమెంటును ట్రంప్ ఆర్గనైజేషన్ కలిగి ఉంది. వచ్చే 12 నెలల్లో 7-8 ప్రాజెక్టులపై రూ.5,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు రెండు సంస్థల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఇందులో రూ.2,500 కోట్లను ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రారంభించే 3-5 స్థిరాస్తి ప్రాజెక్టులపై వెచ్చించనున్నట్లు మెహతా వెల్లడించారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications