Gold Rate: పసిడి ప్రియులకు బ్యాడ్ టైం.. ట్రంప్ వల్ల తగ్గాల్సిన గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయ్..!!

Gold News: దాదాపుగా రెండు వారాల నుంచి నిరంతరాయంగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో భారతీయ పసిడి ప్రియుల్లో ఆందోళన నెలకొంది. ఇదే పరిస్థితి ఇంకెన్ని రోజులు కొనసాగుతుందనే ఆందోళనలు వారిలో ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా ధరల పెరుగుదలకు అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అసలు ప్రపంచ వ్యాప్తంగా పసిడి ధరల పెరుగుదలకు ముఖ్య కారణం అమెరికాలో కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ప్రభుత్వం ఎకనమిక్ పాలసీలపై అంచనాలు పసిడి ధరలను నిరంతరాయంగా పెంచుతున్నాయి. దీనికి తోడు అమెరికా ఉద్యోగాల గణాంకాలు కూడా దీనికి మరో కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ కారణాల వల్ల అమెరికా బాండ్ ఈల్డ్స్, డాలర్ బలంగా కొనసాగుతున్నప్పటికీ గోల్డ్ ధరలు దూకుగా ముందుకు సాగుతూనే ఉన్నాయి. డిసెంబరులో పెరిగిన ఉద్యోగాలతో నిరుద్యోగిత రేటు 4.1 శాతానికి తగ్గిందని వెల్లడైంది.

Trump policy decisions to impact Gold rates despite bond yields and strong dollar

జాబ్ డేటా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వేగంగా వడ్డీ రేట్ల తగ్గింపుకు అడ్డంకిగా నిలుస్తుందని తెలుస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం 2025 ఏడాది మధ్యలో ఒక్కసారి మాత్రమే ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించవచ్చని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో 10 ఏళ్ల యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ 4.745 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. అలాగే బలమైన లేబర్ మార్కెట్ డేటా డాలర్ విలువను బలంగా ముందుకు సాగేందుకు దోహదపడుతోందని నిపుణులు చెబుతున్నారు.

వాస్తవానికి బలమైన లేబర్ మార్కెట్ డేటా వల్ల పసిడి ధరలు తగ్గుదలను చూసిన సంగతి తెలిసిందే. కానీ కొద్ది రోజులకే ధరలు తిరిగి పుంజుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఇతర దేశాలపై పన్నులు, టారిఫ్ లు, భారీగా డిపోర్టేషన్ వంటి కారణాలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయనే ఆందోళనలు ఫెడ్ మానిటరీ పాలసీ నిర్ణయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. డాలర్ పెరిగినప్పుడు తగ్గాల్సిన గోల్డ్ పైన కారణాల వల్ల భిన్నంగా పెరుగుదలను చూస్తోందని వారు చెబుతున్నారు. రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్ల నుంచి పసిడి డిమాండ్ పెరగటం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది.

ట్రంప్ రాక తర్వాత గోల్డ్ పరిస్థితి ఏంటి?
ట్రంప్ విధానాల రాబోయే అమలు మార్కెట్లపై పెద్దగా దూసుకుపోతుంది. నిర్ణయాల కారణంగా.. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగితే బంగారం తీవ్ర ఆందోళన నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఈ పరిస్థితులు రిటైల్ వినియోగదారులకు ఆందోళనకరమైన అంశంగా ఉంది. అయితే పెట్టుబడులు పెట్టేవారికి గోల్డ్ ఈ కాలంలో కొంత లాభాలను అందించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

నేటి ధరలు..
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7946 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7946 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+