Gold News: దాదాపుగా రెండు వారాల నుంచి నిరంతరాయంగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో భారతీయ పసిడి ప్రియుల్లో ఆందోళన నెలకొంది. ఇదే పరిస్థితి ఇంకెన్ని రోజులు కొనసాగుతుందనే ఆందోళనలు వారిలో ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా ధరల పెరుగుదలకు అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అసలు ప్రపంచ వ్యాప్తంగా పసిడి ధరల పెరుగుదలకు ముఖ్య కారణం అమెరికాలో కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ప్రభుత్వం ఎకనమిక్ పాలసీలపై అంచనాలు పసిడి ధరలను నిరంతరాయంగా పెంచుతున్నాయి. దీనికి తోడు అమెరికా ఉద్యోగాల గణాంకాలు కూడా దీనికి మరో కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ కారణాల వల్ల అమెరికా బాండ్ ఈల్డ్స్, డాలర్ బలంగా కొనసాగుతున్నప్పటికీ గోల్డ్ ధరలు దూకుగా ముందుకు సాగుతూనే ఉన్నాయి. డిసెంబరులో పెరిగిన ఉద్యోగాలతో నిరుద్యోగిత రేటు 4.1 శాతానికి తగ్గిందని వెల్లడైంది.

జాబ్ డేటా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వేగంగా వడ్డీ రేట్ల తగ్గింపుకు అడ్డంకిగా నిలుస్తుందని తెలుస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం 2025 ఏడాది మధ్యలో ఒక్కసారి మాత్రమే ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించవచ్చని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో 10 ఏళ్ల యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ 4.745 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. అలాగే బలమైన లేబర్ మార్కెట్ డేటా డాలర్ విలువను బలంగా ముందుకు సాగేందుకు దోహదపడుతోందని నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి బలమైన లేబర్ మార్కెట్ డేటా వల్ల పసిడి ధరలు తగ్గుదలను చూసిన సంగతి తెలిసిందే. కానీ కొద్ది రోజులకే ధరలు తిరిగి పుంజుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఇతర దేశాలపై పన్నులు, టారిఫ్ లు, భారీగా డిపోర్టేషన్ వంటి కారణాలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయనే ఆందోళనలు ఫెడ్ మానిటరీ పాలసీ నిర్ణయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. డాలర్ పెరిగినప్పుడు తగ్గాల్సిన గోల్డ్ పైన కారణాల వల్ల భిన్నంగా పెరుగుదలను చూస్తోందని వారు చెబుతున్నారు. రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్ల నుంచి పసిడి డిమాండ్ పెరగటం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది.
ట్రంప్ రాక తర్వాత గోల్డ్ పరిస్థితి ఏంటి?
ట్రంప్ విధానాల రాబోయే అమలు మార్కెట్లపై పెద్దగా దూసుకుపోతుంది. నిర్ణయాల కారణంగా.. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగితే బంగారం తీవ్ర ఆందోళన నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఈ పరిస్థితులు రిటైల్ వినియోగదారులకు ఆందోళనకరమైన అంశంగా ఉంది. అయితే పెట్టుబడులు పెట్టేవారికి గోల్డ్ ఈ కాలంలో కొంత లాభాలను అందించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
నేటి ధరలు..
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7946 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7946 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications