అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై మరింత కఠినమైన ఆర్థిక చర్యలకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం వరకు భారీ టారిఫ్లు విధించే ద్వైపాక్షిక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అమెరికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ప్రకటించారు. ఈ బిల్లుతో ముఖ్యంగా భారతదేశం, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు నేరుగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో.. రష్యా తక్కువ ధరకు ముడి చమురు విక్రయించడం ద్వారా తన యుద్ధ యంత్రాన్ని కొనసాగిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఆ చమురును పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్న దేశాలే పరోక్షంగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాయని వాషింగ్టన్ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపాదిత చట్టం ద్వారా అలాంటి దేశాలపై ఆర్థిక ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

సెనేటర్ లిండ్సే గ్రాహం X వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్రంప్తో జరిగిన సమావేశం తర్వాత రష్యా ఆంక్షల బిల్లుకు అధికారికంగా గ్రీన్లైట్ లభించింది. ఈ బిల్లును ఆయన సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్తో పాటు మరికొంతమంది ఎంపీలతో కలిసి నెలల తరబడి రూపొందించారు. ఉక్రెయిన్ శాంతి చర్చలు జరుగుతున్న వేళ కూడా రష్యా సైనిక చర్యలు కొనసాగుతుండటంతో, ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయం అత్యంత కీలకమని గ్రాహం వ్యాఖ్యానించారు.
ఈ చట్టం ప్రకారం, రష్యా చమురును కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులు, సేవలపై కనీసం 500 శాతం టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. దీని వల్ల భారతదేశం, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై ట్రంప్కు అపారమైన పరపతి లభిస్తుందని గ్రాహం స్పష్టం చేశారు. ఈ బిల్లును వచ్చే వారం ప్రారంభంలోనే ద్విపార్టీ ఓటింగ్కు తీసుకెళ్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రెండు పార్టీల మద్దతు లభిస్తుందని కూడా విశ్వాసం వ్యక్తం చేశారు.
యుఎస్ కాంగ్రెస్ వెబ్సైట్ ప్రకారం..ఈ ప్రతిపాదిత చట్టానికి రష్యా నిషేధ చట్టం 2025 అనే పేరు పెట్టారు. రష్యాతో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలపై ఆస్తుల స్వాధీనం, ఆర్థిక లావాదేవీలపై నిషేధం వంటి కఠిన చర్యలు కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా రష్యా నుండి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని వస్తువులు, సేవలపై భారీ సుంకాలు విధించడమే దీని ప్రధాన నిబంధనగా ఉంది.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఇటీవల అమెరికా ప్రతినిధి బృందాన్ని కలిశారు. యుద్ధాన్ని ముగించేందుకు దౌత్య మార్గాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. రష్యాపై ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో ఇది మరో అడుగుగా భావిస్తున్నారు.
భారతదేశానికి సంబంధించి.. రష్యా చమురు కొనుగోళ్లపై ఇప్పటికే అమెరికాతో కొంత ఉద్రిక్తత నెలకొంది. భారత వస్తువులపై విధించిన అధిక టారిఫ్లపై ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తిగా ఉన్నారని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే రష్యా చమురు కొనుగోలు ఆపేస్తామని మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. న్యూఢిల్లీ తన ఇంధన విధానం జాతీయ ప్రయోజనాలు, ధరల స్థిరత్వం ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ మద్దతుతో ముందుకు వస్తున్న 500 శాతం టారిఫ్ బిల్లు ఆమోదం పొందితే.. ప్రపంచ ఇంధన వాణిజ్యం, ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?



Click it and Unblock the Notifications