తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం ఇప్పుడు భారతదేశంలోనే అత్యధిక వాహనాలు కలిగిన నగరంగా మారింది. రహదారులపై వాహనాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో, ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ నగరంలో తీవ్రమవుతున్నాయి. ప్రస్తుతం నగరంలోని 900 కి.మీ ప్రధాన రహదారులపై 86 లక్షలకు పైగా వాహనాలు నడుస్తున్నాయి. ఇది ప్రతి కి.మీ రహదారిపై సగటున 9,500 వాహనాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
గత ఆరు సంవత్సరాల్లో వాహనాల సంఖ్య దాదాపు 40 శాతం పెరిగింది. 2019లో ఒక కిలోమీటరుకు సుమారు 6,500 వాహనాలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 9,500కి చేరింది. ఇది రహదారి మౌలిక సదుపాయాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తోంది. మొత్తం వాహనాలను చూసుకున్నట్లయితే 63 లక్షలు ద్విచక్ర వాహనాలు ఉండగా.. 16 లక్షలు కార్లు ఉన్నాయి. ఈ రెండు కలిపి నగర ట్రాఫిక్లో 90 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నాయి. ప్రతిరోజూ 1,500-2,000 కొత్త వాహనాలు నమోదు అవుతున్నాయి. ఈ ట్రెండ్ కొనసాగితే .. 2027-28 నాటికి హైదరాబాద్లో వాహనాల సంఖ్య 1 కోటి దాటే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

ప్రైవేట్ వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ జామ్లు రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ప్రయాణ సమయం పెరగడంతో పాటు ఇంధన వినియోగం ఎక్కువవుతోంది. దీనివల్ల వాయు కాలుష్యం కూడా పెరిగి, పర్యావరణానికి హానికరంగా మారుతోంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర రోడ్ల పొడవు 26,000 కి.మీగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.7 కోట్ల వాహనాలు ఈ రోడ్లపై నడుస్తున్నా.. ప్రతి కి.మీకి కేవలం 653 వాహనాల సాంద్రత మాత్రమే ఉంది. దీని ద్వారా హైదరాబాద్ నగరంపై వాహనాల ఒత్తిడి అసాధారణంగా ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది.
ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఈ వాహన భారాన్ని తట్టుకోలేకపోతోంది. ఒకప్పుడు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా భావించిన మెట్రో రైలు ఇప్పుడు రద్దీ సమయాల్లో కిక్కిరిసిపోతుంది. ఉదయం 8.30 నుండి 10.30 మధ్య నడిచే రైళ్లు ఎప్పుడూ పూర్తి సామర్థ్యాన్ని మించిపోతున్నాయి. ఇది సరైన ప్రణాళిక లేకపోవడం, నిర్వహణ లోపంను సూచిస్తోందని పలువురు చెబుతున్నారు.
రవాణా నిపుణులు దీనికి పలు పరిష్కారాలను సూచిస్తున్నారు.. అవేంటంటే.. కార్పూలింగ్, రైడ్-షేరింగ్ ప్రోత్సహించాలంటున్నారు. Hyderabad నగరంలో మెట్రో, బస్సు సేవలను మరింత బలోపేతం చేయాలని సలహా ఇస్తున్నారు. రెండవ వాహనం కొనుగోలుపై ప్రభుత్వం ఆంక్షలు విధించాలని సూచిస్తున్నారు. వాణిజ్య భవనాలకు తగినంత పార్కింగ్ సదుపాయాలు తప్పనిసరి చేయాలని చెబుతున్నారు.
ఏదేమైనా హైదరాబాద్ వాహనాల సంఖ్యలో వేగంగా పెరుగుతుండటంతో, రోడ్లపై ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. తక్షణ చర్యలు తీసుకోకపోతే, ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రమై, కాలుష్యం కూడా అదుపు తప్పే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రజల సహకారంతో మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం సాధ్యమవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications