ఫేక్ ట్రేడింగ్ స్కాం.. లాయర్ నుంచి రూ. 9 కోట్లు కాజేసిన కేటుగాళ్లు.. ఎలా బుక్కయ్యారంటే..

ముంబైలో భారీ స్థాయి ఆన్‌లైన్ పెట్టుబడి మోసం వెలుగులోకి వచ్చింది. లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టి) సంస్థలో మాజీ అధికారి, రిటైర్డ్ న్యాయవాది అయిన 65 ఏళ్ల ఘనశ్యామ్ మచ్చింద్ర మాత్రే దాదాపు రూ. 9.94 కోట్లు సైబర్ మోసగాళ్ల బారీనపడి కోల్పోయారు. ప్రముఖ ఆర్థిక సంస్థ ఆనంద్ రతి షేర్స్ & స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్ పేరును దుర్వినియోగం చేస్తూ మోసగాళ్లు నిర్వహించిన నకిలీ ట్రేడింగ్ రాకెట్‌లో ఆయన చిక్కుకున్నారు.

ఈ మోసం జూన్‌లో ప్రారంభమైంది. ఎల్ అండ్ టిలో అడ్మిన్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ హెడ్‌గా పనిచేసి, తరువాత లీగల్ కన్సల్టెంట్‌గా కొనసాగుతున్న మాత్రేకు సుమన్ గుప్తా అనే మహిళ వాట్సాప్‌లో సంప్రదించింది. ఆమె తనను ఆనంద్ రతి సంస్థలో అడ్మిన్ అని పేర్కొంది. కంపెనీ పెట్టుబడుల కోసం AR Trade Mobi అనే యాప్‌ను ఉపయోగిస్తామని చెప్పి, ఆ యాప్ లింక్‌ను పంపింది.

Mumbai trading scam fake trading racket retired lawyer duped 10 crore scam Mumbai online trading fraud India cybercrime Mumbai investment scam fake stock trading app senior citizen fraud Mumbai police cyber cell financial fraud case high-return trading scam digital investment scam online trading racket Mumbai cyber fraud news 10

యాప్ నమ్మకంగా అనిపించేందుకు, ఆమె KYC కోసం పాన్ కార్డు సహా వ్యక్తిగత వివరాలను కోరింది. వివరాలు ఇచ్చిన తరువాత, మాత్రేను Anand Rathi VIP 12 అనే వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. ఈ గ్రూప్‌లో ఉన్న పలువురు వ్యక్తులు మార్కెట్ నిపుణులు, స్టాక్ విశ్లేషకులు, పెట్టుబడి సలహాదారుల్లా ప్రవర్తిస్తూ IPOలు, మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్ అప్‌డేట్‌లను పంచుకున్నారు. దీనివల్ల అతనికి ఇది నిజమైన పెట్టుబడి వేదికగా భావించేలా వారు కొనసాగారు.

యాప్‌లో నకిలీ లాభాలు చూపించడం ప్రారంభమైంది. పెట్టుబడులు పెరుగుతున్నాయని అనుకొని మాత్రే పెద్ద మొత్తాల్లో డబ్బు బదిలీ చేయడం మొదలుపెట్టారు. జూన్ నుండి నవంబర్ 2025 వరకు, ఆయన రూ.9.94 కోట్లకు పైగా అనేక బ్యాంకు ఖాతాలకు పంపించారు. ఈ చెల్లింపులను IPOలు, మ్యూచువల్ ఫండ్లు, ప్రత్యేక పెట్టుబడి స్కీములుగా చూపించారు. తర్వాత, Lawyer డబ్బును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించగా లావాదేవీ విఫలమైంది.

కారణంగా సాంకేతిక లోపాలు ఉన్నాయని, ఉపసంహరణ కోసం అదనంగా పన్నులు, చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని మోసగాళ్లు చెప్పడం ప్రారంభించారు. దీనితో అతనికి అనుమానం వచ్చి, మలద్‌లోని ఆనంద్ రతి కార్యాలయానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.అక్కడ అధికారులు సుమన్ గుప్తా అనే వ్యక్తి తమ సంస్థలో పనిచేయడం లేదని, అలాగే AR Trade Mobi యాప్‌కు తమ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీంతో మాత్రే ఒక పెద్ద సైబర్ స్కామ్‌కు బలయ్యానని గ్రహించారు.

తర్వాత ఆయన తూర్పు ప్రాంత సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. పోలీసులు పది మంది గుర్తు తెలియని వ్యక్తులపై భారతీయ న్యాయ సంహిత (BNS), సమాచార సాంకేతిక చట్టం కింద FIR నమోదు చేశారు. ఈ మోసం దేశవ్యాప్తంగా పనిచేసే ఒక పెద్ద నెట్‌వర్క్‌దని, ప్రముఖ ఆర్థిక సంస్థల పేర్లతో నకిలీ వాట్సాప్ గ్రూపులు సృష్టించి, అధిక లాభాలు వస్తాయని చెప్పి ప్రజలను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులు ఈ నిధులు క్రెడిట్ అయిన అకౌంట్ల వివరాల ట్రాక్ చేస్తూ.. ఇందులో పాల్గొన్న నిందితులను గుర్తించి పట్టుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన ఆన్‌లైన్ పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌లలో పెరుగుతున్న మోసాలపై మరోసారి హెచ్చరికగా మారింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+