EV స్పేస్లో టయెటా భారీ ప్లాన్.. ఏకంగా మెర్సిడెజ్ బెంజ్ రికార్డుకే ఎసరు..
EV: సంప్రదాయ డీజిల్, పెట్రోల్ను కాదని ఇండియా ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఇంధనం వైపు మొగ్గు చూపుతోంది. వీటి వినియోగాన్ని పెంచేందుకు పలు ప్రోత్సాహకాలను సైతం కేంద్రం ప్రకటించి, అమలు చేస్తోంది. అయితే ఇప్పటికీ కొంతమంది పరిధి, ఛార్జ్ సమయం చూసి వెనకడుగు వేస్తున్నారు. సరిగ్గా వీటికి చెక్ పెట్టేందుకు టయోటా ప్లాన్ చేస్తోంది.
జపనీస్ ఆటోమోటివ్ దిగ్గజం టయోటా సాలిడ్ స్టేట్ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాన్ని దింపేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 1,200 కి.మీ పరిధి వరకు ప్రయాణం చేసే విధంగా దీన్ని రూపొందిస్తోంది. కేవలం 10 నిమిషాల ఛార్జ్ సమయం కలిగి ఉండే విధంగా తయారు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ఎలాన్ మస్క్ టెస్లా సూపర్ ఛార్జర్లు కూడా 15 నిమిషాల టైమ్ తీసుకుంటూ, 200 మైళ్ల పరిధి వరకు మాత్రమే పనిచేస్తాయి. దీనిని అధిగమించేందుకు ఇప్పుడు టయోటా పనిచేస్తుందన్నమాట.

కంపెనీ వెల్లడించిన కొత్త టెక్నాలజీ రోడ్మ్యాప్లో భాగంగా.. 2026 నాటికి నెక్స్ట్ జెనరేషన్ EVలకు అధిక పనితీరు కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీలను పరిచయం చేయాలని యోచిస్తోంది. ఇవి త్వరిత ఛార్జింగ్ను అందిస్తూ, సుమారు వెయ్యి కి.మీ పరిధిని అందిస్తాయి. ఇదే కనుక జరిగితే వాహనాల పోటీలో టయోటా ముందంజలో ఉంటుంది అనడంలో సందేహం లేదు.
"వెహికల్ యాక్సిస్లో తదుపరి తరం బ్యాటరీలు మరియు సోనిక్ టెక్నాలజీని అనుసంధానం చేయడం ద్వారా వెయ్యి కి.మీల క్రూజింగ్ పరిధిని సాధిస్తాము" అని టయోటా తెలిపింది. గతేడాది మెర్సిడెజ్ బెండ్ తన దీర్ఘ శ్రేణి 'విజన్ EQXX' కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది.
పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీతో ఇది 1,000 కి.మీలకు పైగా ప్రయాణించింది. తద్వారా ఒకే ఛార్జ్పై అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన EVగా రికార్డు సృష్టించింది. ఈ ఫీట్ను సాధించేందుకు ప్రస్తుతం టయోటా పనిచేస్తుంది. 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications