న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దెబ్బతిన్న వివిధ రంగాలకు 8 ఆర్థిక ఉపశమన చర్యలు ప్రకటిస్తున్నామని, ఇందులో నాలుగు కొత్తవి అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం నేడు (జూన్ 28, సోమవారం) ఆర్థిక ప్యాకేజీతో ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా నిర్మలమ్మ ప్రకటన చేశారు. కరోనాతో దెబ్బతిన్న రంగాలకు రూ.1.1 లక్షల కోట్ల లోన్ గ్యారెంటీ స్కీంను ప్రకటించారు. ఆత్మనిర్భరం భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారెంటీ స్కీంను మరో రూ.1.5 లక్షల కోట్లను అదనంగా ప్రకటించారు.
లోన్ గ్యారెంటీ స్కీంలో హెల్త్ రంగానికి రూ.50,000 కోట్లు, ఇతర రంగాలకు అదనంగా రూ.60,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రంగాలవారీగా కేటాయింపులను ప్రకటిస్తామన్నారు. తాజాగా ప్రకటించిన కొత్త క్రెడిట్ గ్యారెంటీ స్కీం MFIల ద్వారా 25 లక్షల మంది వ్యాపారులకు రుణ సౌకర్యం కల్పిస్తుందని నిర్మలమ్మ తెలిపారు.

ఇండివిడ్యువల్స్కు రుణ పరిమితి రూ.1.25 లక్షలు, మూడేళ్ల కాలపరిమితితో ఉంటుందని చెప్పారు. పాత రుణాలతో సంబంధం లేకుండా కొత్త రుణాలు ఇస్తామన్నారు. వ్యాపార పునరుద్ధరణకు ఈ రుణాలు ఉపయోగపడతాయన్నారు. ఎంసీఎల్ఆర్తో పోలిస్తే వడ్డీ రేటు కనీసం 2 శాతం తక్కువగా ఉంటుందన్నారు. గరిష్టంగా రూ.100 కోట్ల వరకు మూడేళ్లకు హామీ ఉంటుందన్నారు. వడ్డీ రేటు 7.95 శాతంగా ఉంటుందని చెప్పారు. వైద్య, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు,
11,000కు పైగా రిజిస్టర్డ్ టూరిస్ట్ గైడ్స్/ట్రావెల్ అండ్ టూరిజం స్టేక్ హోల్డర్స్కు లోన్ గ్యారెంటీ స్కీం ద్వారా ఆర్థిక మద్దతు ఇస్తామని నిర్మలమ్మ తెలిపారు. టూరిజం రంగానికి ఊతమిచ్చే లక్ష్యంలో భాగంగా మొదటి 5 లక్షల మంది టూరిస్ట్లకు ఉచితంగా వీసా సౌకర్యం కల్పిస్తామన్నారు. మొత్తం రూ.100 కోట్ల ప్యాకేజీ ఉంటుందన్నారు. ఆత్మనిర్భర్ రోజ్గార్ యోజనను 31 మార్చి 2021 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications