Torrent Power Stock: ఎనర్జీ రంగంలోని షేర్లపై చాలా కాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగుతోంది. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి తోడుగా గృహ వినియోగం పెరగటం, ఈవీ వాహనాలవైపు ప్రభుత్వం ప్రజలను మళ్లించే ప్రయత్నం వంటి కారణాలు విద్యుత్ డిమాండ్ పెంచుతోంది. దీనికి తోడు ఇతర కారణాలతో ఈ రంగంలోని స్టాక్స్ సూపర్ లాభాలను చూస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టోరెంట్ పవర్ కంపెనీ షేర్ల గురించే. టొరెంట్ గ్రూప్ కంపెనీ ఏప్రిల్-జూన్ త్రైమాసిక కాలానికి బలమైన లాభాలు ప్రకటించటంతో పవర్ షేర్లలో తుఫాను పెరుగుదల నమోదైంది. ఫలితాలతో కంపెనీ షేర్లు నేడు ఇంట్రాడేలో ఏకంగా 18 శాతం లాభపడ్డాయి. ఈ క్రమంలో ఒక్కో షేరు ధర రూ.1,899 స్థాయికి చేరి సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేశాయి.

జూన్ 2024 త్రైమాసికంలో కంపెనీ రూ.996.3 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది ప్రాతిపదికన తొలి త్రైమాసికంలో నికర లాభం 87.2% పెరుగుదలను చూసింది. ఇదే క్రమంలో కంపెనీ ఆదాయం 23.3% పెరిగి రూ.9,033.7 కోట్లకు చేరినట్లు కంపెనీ ప్రకటించింది. నిర్వహణ స్థాయిలో టొరెంట్ పవర్ EBITDA సుమారు 57% పెరిగి రూ.1,857.9 కోట్లకు చేరుకుంది. EBITDA మార్జిన్ గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 16.2% నుంచి 20.6%కి మెరుగుపడింది. అలాగే టొరెంట్ ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 100% ఈక్విటీ షేర్లను టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.85 కోట్లకు విక్రయించేందుకు బోర్డ్ ఆఫ్ టోరెంట్ పవర్ ఆమోదించింది.
గడచిన ఏడాది కాలంలో టొరెంట్ పవర్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు 180 శాతం రాబడిని అందించింది. జూలై 31, 2023న కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.676.50 ధర వద్ద ఉండగా.. నేడు తరికొత్త గరిష్ఠమైన రూ.1,899కి చేరుకున్నాయి. అలాగే 2024లో టొరెంట్ పవర్ షేర్లు 103% రాబడిని అందించింది. అలాగే గత 6 నెలల కాలంలో టోరెంట్ పవర్ షేర్లు 83% పెరిగాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications