HCLTech News: దేశంలోని టెక్ కంపెనీలు ప్రస్తుతం అధిక ఖర్చుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రాజెక్టుల రాక మందగించటంతో అధిక వేతనాలున్న ఉద్యోగులను అప్రెన్టీస్లను నియమించుకుంటున్నట్లు నివేదికలు బయటపడ్డాయి.
ఇలాంటి వ్యాపార వాతావరణంలో దేశంలోని 3వ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ HCL టెక్నాలజీస్ లిమిటెడ్ బెంగళూరులోని తన కార్యాలయ ఆస్తులను విక్రయించాలని యోచిస్తోంది. దీనికి ముందు టాప్ టెక్ కంపెనీ అయిన విప్రో సైతం తన హైదరాబాదు, బెంగళూరు ఆస్తులను విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అనవసరపు ఖర్చుల మదింపులో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు వస్తున్నాయని తెలుస్తోంది. రోషిణి నాడార్ నేతృత్వంలోని హెచ్సిఎల్ టెక్ వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా కొన్ని కొత్త రంగాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంది.

కర్ణాటకలో సెమీకండక్టర్ చిప్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని హెచ్సీఎల్ గ్రూప్ నిర్ణయించింది. ఇందుకోసం రోషిణి నాడార్ దాదాపు 400 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు సమాచారం. దీనికోసం బెంగళూరు విమానాశ్రయ సమీపంలో, మైసూరూలో భూ కేటాయింపు జరిగినట్లు తెలుస్తోంది. వ్యూహాత్మక పునర్నిర్మాణంలో భాగంగా నాన్-కోర్ రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించడం ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో హెచ్సీఎల్ టెక్ బెంగళూరులోని ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో ఒకటైన జిగాని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న తన స్పెషల్ ఎకనామిక్ జోన్ కాంప్లెక్స్ను విక్రయించాలని నిర్ణయించుకుంది.దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ఉంది. ఈ విక్రయం ద్వారా దాదాపు రూ.550 కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది HCL హార్డ్వేర్ వ్యాపారం నుండి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. కంపెనీ గత ఏడాది చెన్నైలో 6.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అదనంగా HCL టెక్ తన ఉద్యోగులలో 70-75% మందిని ప్రస్తుత సంవత్సరం చివరి నాటికి తిరిగి కార్యాలయానికి పిలవాలని యోచిస్తోంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications