2జీ నిర్మాణానికి వారికి 25 ఏళ్లు, 4జీ నిర్మాణానికి జియోకు 3 ఏళ్లు: ముఖేష్ అంబానీ

చాలా ఏళ్లుగా ఉన్న టెలికం కంపెనీలు 2జీ నెట్ వర్క్‌ను నిర్మించేందుకు 25 సంవత్సరాలు తీసుకున్నాయని, జియో మాత్రం మూడేళ్లలోనే 4జీ నెట్ వర్క్‌ని నిర్మించిందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు రిలయన్స్ జియో సిద్ధంగా ఉందని చెప్పారు.

టీఎం ఫోరం ఆధ్వర్యంలోని డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వరల్డ్ సిరీస్ 2020 వర్చువల్ భేటీలో ముఖేష్ అంబానీ మాట్లాడారు. 2016లో జియో టెలికం పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటి నుండి మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలో 155వ స్థానంలో ఉన్న భారత్ అగ్రస్థానానికి వచ్చిందన్నారు.

Took older telcos 25 years to build 2G, took Jio 3 years for 4G: Mukesh Ambani

జియో తన ప్రస్ధానం మొదలుపెట్టిన 170 రోజుల్లో 10 కోట్ల మంది కస్టమర్లను ఆకట్టుకుందన్నారు. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లు జియో నెట్ వర్క్‌లో చేరుతున్నారన్నారు. దేశంలో డేటా నెలసరి వినిమయం 0.2 బిలియన్ జీబీ నుంచి 600 శాతం వృద్ధితో 1.2 బిలియన్ జీబీకి చేరుకుందన్నారు. అప్పటి నుంచి డేటా వినిమయం భారీగా పెరిగిందని, దేశంలో ప్రస్తుతం జియో రాక మునుపుతో పోలిస్తే నెలకు 30 రెట్లు అధికంగా డేటా వినిమయం ఉందన్నారు.

50 కోట్ల మంది కస్టమర్ల దిశగా రిలయన్స్ జియో సాగుతోందన్నారు. కనెక్టివిటీలో మరింత ముందుకు సాగే లక్ష్యంలో భాగంగా హైస్పీడ్, ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్‌ను ప్రారంభించిందన్నారు. ప్రపంచంలోనే అతి తక్కువ డేటా టారిఫ్స్‌ను ప్రారంభించామని తెలిపారు. జియో యూజర్లకు వాయిస్ సేవలను ఉచితంగా అందించినట్లు తెలిపారు. జియోకు ముందు స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయలేక, 2జీ ఫీచర్ ఫోన్లతో సాధ్యం కాక ఎంతోమంది భారతీయులు డిజిటల్‌కు దూరంగా ఉన్నారన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+