Yes Bank Q2 Reults: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ మంచి ఫలితాలు ప్రకటించిన తర్వాత యెస్ బ్యాంక్ తన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.
యెస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను నేడు ప్రకటించింది. రెండో త్రైమాసికంలో నికర లాభం 47.4 శాతం పెరిగి రూ.225.21 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.152.82 కోట్లుగా ఉంది. రిపోర్టింగ్ త్రైమాసికంలో బ్యాంక్ ఆస్తి నాణ్యత మెరుగుపడింది. స్థూల నాన్-పెర్ఫార్మింగ్ అసెట్(NPA) నిష్పత్తి 2 శాతంగా ఉంది. నికర NPA నిష్పత్తి 0.9 శాతంగా ఉంది. సెప్టెంబర్ 30 నాటికి నికర ఎన్పీఏ రూ.27,419.11 కోట్లుగా ఉంది.

రిపోర్టింగ్ త్రైమాసికంలో కేటాయింపులు సంవత్సరానికి 14.1 శాతం తగ్గి రూ.500.38 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంక్ ప్రొవిజన్ కవరేజ్ రేషియో(PCR) గత త్రైమాసికంలో 48.4 శాతం నుంచి 56.4 శాతానికి చేరుకుంది. యెస్ బ్యాంక్ డిపాజిట్లు ఏడాదికి 17.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. త్రైమాసికంలో 6.8 శాతం పెరిగి రూ.2.34 లక్షల కోట్లకు చేరుకుంది. అడ్వాన్స్లు సెప్టెంబర్ త్రైమాసికంలో 5.2 శాతం పెరిగి రూ.2.20 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ త్రైమాసికంలో 3.91 లక్షల CASA ఖాతాలు తెరవబడ్డాయి.
బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.1,925 కోట్లుగా ఉంది. ఇది సంవత్సరానికి 3.3 శాతం పెరిగింది. రెండవ త్రైమాసికంలో వడ్డీయేతర ఆదాయం ఆదాయం సంవత్సరానికి 38.4 శాతం, త్రైమాసికంలో 6.0 శాతం పెరిగి రూ.1,210 కోట్లకు చేరుకుంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో యెస్ బ్యాంక్ వడ్డీ రూ.4,785.61 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.3,483.02 కోట్లుగా నమోదైంది.


Click it and Unblock the Notifications