తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల పంపిణీ నిలిపివేసిన టీటీడీ.. మళ్లీ ఎప్పుడంటే..

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి అనుకోకుండా విపరీతమైన సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు తిరుమలకు చేరుకున్న యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ఉచిత స్లాటెడ్ సర్వ దర్శన్ (ఎస్‌ఎస్‌డి) టోకెన్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసింది. సాధారణంగా తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల ద్వారా మరుసటి రోజు దర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డి టోకెన్లను జారీ చేస్తుంటారు.

అయితే భక్తుల రద్దీ అసాధారణంగా ఉండటంతో బుధవారం జారీ చేయాల్సిన టోకెన్ల పంపిణీని అధికారులు నిలిపివేశారు. దీనివల్ల గురువారం నాటి దర్శన టోకెన్లు భక్తులకు లభించలేదు. అయితే, పరిస్థితులను సమీక్షించిన ఆలయ యంత్రాంగం శుక్రవారం నాటి దర్శనానికి సంబంధించిన సాధారణ టోకెన్ల పంపిణీని గురువారం మధ్యాహ్నం నుండి తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

TTD Tirumala Darshan SSD Tokens Tirupati Darshan Tirumala Rush Tirumala Update Tirupati News Slotted Sarva Darshan TTD News Andhra Pradesh News TTD SSD Tirumala Darshan Tirupati News TTD Update

ప్రస్తుతం తిరుమలలో ఉచిత దర్శనం కోసం వేచి ఉండే సమయం ఊహించని రీతిలో పెరిగింది. తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని 9 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీని ప్రభావంతో ఉచిత దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులు స్వామివారి దర్శన భాగ్యం పొందేందుకు దాదాపు 12 నుండి 24 గంటల సుదీర్ఘ సమయం క్యూ లైన్లలోనే వేచి ఉండాల్సి వస్తోంది.

సాధారణంగా ప్రతి సంవత్సరం జూలై నెలలో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడం, వర్షాకాలం ప్రారంభం కావడం వల్ల Tirumala కు భక్తుల రాక తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది దానికి భిన్నంగా గత రెండు వారాలుగా భక్తుల రాక అసాధారణ రీతిలో పెరగడం ఆలయ అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది. భక్తుల రద్దీని తట్టుకోలేక వరుసగా నాలుగో వారం కూడా అధికారులు ఎస్‌ఎస్‌డి టోకెన్ల పంపిణీకి స్వస్తి పలకాల్సి వచ్చింది.

Also Read

గత మంగళవారం పంపిణీ చేసిన ఎస్‌ఎస్‌డి టోకెన్లు ప్రారంభించిన కేవలం గంట వ్యవధిలోనే ముగిసిపోవడంతో.. సుదూర ప్రాంతాల నుండి ఎంతో ఆశతో ప్రయాణించి వచ్చిన అనేకమంది భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ తరహా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది. సుదూర ప్రాంతాల నుండి తిరుమల యాత్రకు బయలుదేరే భక్తులు ముందుగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా మీడియా ద్వారా తాజా సమాచారాన్ని, రద్దీ వివరాలను సరిచూసుకోవాలని కోరింది. దానికి అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలను సమర్థవంతంగా సిద్ధం చేసుకోవాలని, ఆలయ ప్రాంగణంలో సేవలు అందించే క్రమంలో యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

ఇదిలా ఉండగా తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జూలై 24 నుండి జూలై 26 వరకు ప్రత్యేక ధార్మిక ఉత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మూడు రోజుల పాటు శ్రీ గోవిందరాజస్వామి వారి దేవతామూర్తులకు శాస్త్రోక్తంగా విద్యుక్త అభిషేకంతో పాటు పలు విశేష పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు. స్థానిక భక్తులతో పాటు తిరుమలకు వచ్చే యాత్రికులు కూడా ఈ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావచ్చు.

శ్రీవాణి దర్శన భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది టీటీడీ. తిరుమలలో ఎయిర్‌పోర్ట్‌ తరహా లాంజ్‌కు టీటీడీ ప్రణాళికను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. తిరుమల శ్రీవాణి దర్శన టికెట్లు పొందిన భక్తుల కోసం ప్రత్యేక లాంజ్‌ను ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యోచిస్తోంది. కరెంట్ బుకింగ్‌లో టికెట్లు పొందిన భక్తులు దర్శనం సమయం వరకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుండటంతో వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంటోంది. ప్రస్తుతం శ్రీవాణి దర్శన టికెట్లను మూడు నెలల ముందుగానే రోజుకు 500 ఆన్‌లైన్‌లో, మరో 500 కరెంట్ బుకింగ్ ద్వారా, గతంలో రూ.10 వేల విరాళం ఇచ్చి టికెట్ పొందని భక్తులకు 300 టికెట్లు, అలాగే తిరుపతి విమానాశ్రయంలో రోజూ 200 ఆఫ్‌లైన్ టికెట్లను కేటాయిస్తున్నారు. రూ.10 వేల విరాళంతో పాటు రూ.500 దర్శన టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తోంది.

మూడు నెలల ముందే టికెట్లు బుక్ చేసుకున్న వారికి గదుల కేటాయింపు జరుగుతున్నప్పటికీ.. కరెంట్ బుకింగ్‌లో ఉదయం టికెట్ పొందిన భక్తులు సాయంత్రం దర్శనం వరకు వేచి ఉండాల్సి వస్తోంది. వారికి గదుల సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఈ నేపథ్యంలో తిరుమలలోని అన్నమయ్య భవనం సమీపంలో ఉన్న న్యూ ఉడ్‌సైడ్ హోటల్ భవనాన్ని ఎయిర్‌పోర్ట్‌ల తరహా లాంజ్‌గా అభివృద్ధి చేయాలని టీటీడీ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ భవనంలో విశ్రాంతి గదులు, సౌకర్యవంతమైన ఫర్నిచర్, స్నానాల గదులు, ఇంటర్నెట్ సదుపాయం, ఫుడ్‌కోర్ట్ వంటి ఆధునిక వసతులను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, శ్రీవాణి దర్శన టికెట్ పొందిన భక్తులు దర్శనం సమయం వరకు సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునే అవకాశం లభించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+