పేటీఎంకు భారీ షాక్, ఒకేసారి ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ రాజీనామా
ఫిన్టెక్ దిగ్గజం పేటీఎంకు భారీ షాక్! పేటీఎం నుండి మూడు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ రాజీనామా చేశారు. గత రెండేళ్లుగా పేటీఎం నుండి పలువురు సీనియర్ ఉద్యోగులు బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వెంటవెంటనే రాజీనామా చేయడం గమనార్హం. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) అభిషేక్ అరుణ్, ఆఫ్ లైన్ పేమెంట్స్ సీవోవే రేణు శట్టి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సీవోవో అభిషేక్ గుప్తా రాజీనామాలు సమర్పించినట్లు వార్తలు వచ్చాయి.
అయిదేళ్లకు పైగా పేటీఎంలో సేవలు అందిస్తున్న అభిషేక్ అరుణ్ కంపెనీ నుండి వైదొలుగుతున్నట్లు లింక్డిన్ పోస్ట్ ద్వారా తెలిపారు. అతను గతంలో ఆర్బీఎల్ బ్యాంకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పని చేశారు. అభిషేక్ గుప్తా, రేణు శట్టి గత ఏడాది పేటీఎంలో చేరారు. ఇటీవల వీరు కూడా రాజీనామాలు సమర్పించారని తెలుస్తోంది. ఈ రాజీనామాల పైన పేటీఎం నుండి ప్రకటన వెలువడాల్సి ఉంది.
రేణు పేటీఎంలో హ్యూమన్ రిసోర్సెస్ డిపార్టుమెంట్లో మేనేజరియల్ రోల్ ద్వారా ఇందులో కెరీర్ ప్రారంభించారు. పేటీఎం పేమెంట్ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా పని చేశారు. ఏడాది క్రితం బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకున్నారు. రేణు రాజీనామా ఆశ్చర్యపరిచిందని అంటున్నారు. మరో ఎగ్జిక్యూటివ్ అభిషేక్ గుప్తా గత ఏడాది ఇందులో చేరారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సీవోవో (లెండింగ్)గా ఉన్నారు. అతను రాజీనామా చేశారు.