PF: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. త్వరలో వడ్డీ జమా అయ్యే అవకాశం..!
ప్రభుత్వం త్వరలో ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాదారుల ఖాతాలో వడ్డీని జమా చేసే అవకాశం ఉంది. పీఎఫ్లో డిపాజిట్ చేసిన మొత్తంపై ప్రభుత్వం వడ్డీ రేటును ఇప్పటికే నిర్ణయించింది. పీఎఫ్ ఖాతాదారులు తమ డిపాజిట్లపై 8.1 శాతం వడ్డీని పొందనున్నారు. అయితే, వడ్డీ మొత్తాన్ని ఎప్పుడు బదిలీ చేస్తారు అనే దాని గురించి ప్రభుత్వం లేదా EPFO నుంచి ఎలాంటి సమాచారం లేదు.
లక్షకు రూ.8,100
ప్రభుత్వం ఈ నెలలో పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తంపై వడ్డీ డబ్బును వేయవచ్చని వార్తలు వస్తున్నాయి. పీఎఫ్ ఖాతాదారుల ఖాతాలో ఉన్న డబ్బును బట్టి వడ్డీ మొత్తం వస్తుంది. మీ PF ఖాతాలో ఒక లక్ష రూపాయలు జమ అయ్యాయని అనుకుందాం, ఆపై 8.1 శాతం చొప్పున, మీకు వార్షికంగా రూ. 8,100 వడ్డీ లభిస్తుంది.
85 శాతం డెట్
PF ఖాతాదారుడి ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని EPFO చాలా చోట్ల పెట్టుబడి పెడుతుంది. ఈ పెట్టుబడి ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని వడ్డీ రూపంలో ఖాతాదారులకు అందజేస్తారు. ప్రస్తుతం, EPFO 85 శాతం డెట్ ఆప్షన్లలో పెట్టుబడి పెడుతోంది. వీటిలో ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లు కూడా ఉన్నాయి. మిగిలిన 15 శాతం ఈటీఎఫ్లలో పెట్టుబడి పెడతారు.
బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే..
EPFO వెబ్సైట్కి వెళ్లి అక్కడ ఎంప్లాయిస్ సర్వీస్ పై క్లిక్ చేయండి. తర్వాత పాస్బుక్పై క్లిక్ చేయండి. ఇప్పుడు UAN నంబర్, పాస్వర్డ్ సహాయంతో లాగిన్ చేయండి. PF ఖాతాను ఎంచుకోండి. మీరు దాన్ని తెరిచిన వెంటనే మీకు బ్యాలెన్స్ కనిపిస్తుంది. SMS ద్వారా బ్యాలెన్స్ని చెక్ చేయడానికి, 7738299899కి 'EPFOHO UAN ENG' అని టైప్ చేయడం ద్వారా సందేశాన్ని పంపండి. మీరు రిప్లైలో బ్యాలెన్స్ సమాచారాన్ని పొందుతారు.