Suprem Court: గౌతమ్ అదానీ గ్రూప్‍పై విచారణకు సెబికి మరింత సమయమిచ్చిన సుప్రీం..

అదానీ గ్రూప్ హిండన్ బర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేయడానికి బుధవారం నాడు సుప్రీంకోర్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)కి ఆగస్టు 14 వరకు అదనంగా మూడు నెలల గడువు ఇచ్చింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ స్టాక్ ధరల తారుమారు ఆరోపణలపై దర్యాప్తునకు సంబంధించి తాజా స్థితి నివేదికను దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సెబిని ఆదేశించింది.

న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం, ఈ విషయంలో కోర్టుకు సహకరించడానికి వీలుగా తమకు సమర్పించిన జస్టిస్ ఎఎం సప్రే కమిటీ నివేదికను అందరికి అందుబాటులో ఉంచాలని సెబికి స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను జులై 11కు వాయిదా వేసింది.

Suprem Court

అంతకుముందు, ఈ అంశంపై విచారణకు మరింత సమయం కావాలని సెబీ జూలై 25న సుప్రీంకోర్టును కోరింది. జులై 31లోగా తన నివేదికను సమర్పించాలని రెగ్యులేటర్‌ని సుప్రీం గతంలో ఆదేశించింది. జనవరిలో అదానీ గ్రూప్ మారిషస్ కేంద్రంగా కంపెనీలను ఏర్పాటు చేసి, వాటికి నిధులు మళ్లింపు చేసిందని..మారిషస్ నుంచి షేర్లను కృత్రిమంగా కొనిపిస్తూ వాటి ధరలను పెంచుకుంటూ పోయిందని హిండెన్ బర్గ్ ఆరోపించింది.

Suprem Court

దీని కారణంగా అదానీ గ్రూప్ షేర్లు 70 శాతం వరకు పడిపోయాయి. అంతేకాదు ఇన్వెస్టర్లు సైతం లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు. ఇదే సమయంలో హిండెన్ బర్గ్ వ్యవహారంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో తమకు నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్ట్ సెబీని ఆదేశిస్తూ రెండు నెలలు గడువు విధించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+