Wheat: పెరుగుతున్న గోధుమ ధరలు.. బిస్కెట్లు, బ్రెడ్ ధర పెరిగే అవకాశం..

దేశంలో గోధుమల ధరలు భారీగా పెరిగాయి. మే 2022లో దేశీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల కారణంగా, ప్రభుత్వం గోధుమల ఎగుమతిని నిషేధించింది. అయినా మే నుంచి ఇప్పటివరకు గోధుమల ధరలు 27 శాతం పెరిగాయి. పెరిగే ధరలు కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. అప్పట్లో వంట నూనె ధరులు కూడా భారీగా పెరిగాయి.

దిగుమతి పన్ను
గోధుమల ధరలను నియంత్రించడానికి, ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో నిల్వ చేసిన స్టాక్ నుంచి గోధుమలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇది కాకుండా, దేశంలో గోధుమ దిగుమతిపై 40 శాతం దిగుమతి పన్నును రద్దు అవకాశం కూడా ఉంది. ఎగుమతులను నిషేధించిన తర్వాత కూడా గోధుమల ధరలు పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో గోధుమ ధర టన్ను రూ. 26,500కి పలుకుతున్నాయి.

 The price of wheat in the country has been increasing since May

బిస్కెట్లు, బ్రెడ్ ధర పెరిగే అవకాశం
ప్రపంచంలో గోధుమల ఉత్పత్తిలో భారత్ రెండవ స్థానంలో ఉంది. దేశంలో వినియోగం కూడా చాలా ఎక్కువగా ఉంది. గోధుమ ధరలు పెరిగిన కారణంగా బిస్కెట్లు, బ్రెడ్ వంటి వాటితో తయారైన వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కొత్త గోధుమ క్రాప్ రావాలంటే సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అప్పటి వరకు ధరలను అదుపులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ గిడ్డంగిలో 21.5 మిలియన్ టన్నుల గోధుమల నిల్వ ఉంది. ఆహార సంక్షోభం తలెత్తకుండా బియ్యం, గోధుమలు ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేస్తుంటారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+