మహారాష్ట్రలోని టుంకీ అనే చిన్న గ్రామంలో 1985లో హితేష్ చిమన్లాల్ దోషీ అనే యువకుడు పెద్ద కలలు కనేవాడు. డబ్బు లేకపోయినా, "ఏదో ఒక రోజు నేను నా సొంత వ్యాపారం మొదలుపెడతా" అని తనలో నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకమే అతన్ని ఈరోజు భారత్లోని అతిపెద్ద సోలార్ కంపెనీ యజమానిగా నిలబెట్టింది.
హితేష్ కుటుంబం వ్యాపార కుటుంబం కాదు. అయినప్పటికీ, అతను ఒక బంధువు దగ్గర నుంచి కేవలం రూ. 5,000 అప్పు తీసుకొని తన వ్యాపారం ప్రారంభించాడు. ఆ సమయంలో అతని కుటుంబం దగ్గర కూడా పెద్దగా సంపద లేదు, ఇంట్లో విద్యుత్, ఫోన్ లాంటివి కూడా ఉండే పరిస్థితి కాదు. తండ్రి చిన్న కిరాణా దుకాణం నడిపేవారు. అయినా హితేష్ వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగాడు.

మొదట్లో హితేష్ దోషీ థర్మల్ ఎక్విప్మెంట్ వ్యాపారంలో పనిచేశాడు. అంటే, హీటింగ్, ఎనర్జీకి సంబంధించిన పరికరాలను తయారు చేసి అమ్మడం అతని మొదటి వ్యాపారం. ఆ వ్యాపారం సరిగా నడుస్తున్నప్పటికీ, అతని మనసు ఎప్పుడూ కొత్త అవకాశాల కోసం చూస్తూనే ఉండేది. 2007లో అతను జర్మనీలో జరిగిన ఒక ట్రేడ్ షోకు వెళ్లాడు. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు తమ కొత్త ఎనర్జీ టెక్నాలజీలను ప్రదర్శించాయి. అదే సమయంలో అతను మొదటిసారి సోలార్ ఎనర్జీ యొక్క అపారమైన శక్తి, దాని భవిష్యత్ ప్రాధాన్యతను గుర్తించాడు.
ఆ అనుభవం అతని ఆలోచననే పూర్తిగా మార్చేసింది. "ఇదే భవిష్యత్తు" అని అనుకుని, తన పాత థర్మల్ వ్యాపారాన్ని అమ్మేసి, మొత్తం దృష్టిని సోలార్ ఎనర్జీపై కేంద్రీకరించాడు. అలా అతను సోలార్ సెల్ తయారీ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇది చాలా పెద్ద రిస్క్ అయినా, హితేష్ తన నమ్మకంతో ముందుకు సాగాడు. తనకు ప్రేరణగా నిలిచిన తన గ్రామంలోని "వారీ ఆలయం" పేరు మీదే కొత్త కంపెనీకి వారీ ఎనర్జీస్ (Waaree Energies) అని పేరు పెట్టాడు. చిన్న గ్రామంలో మొదలైన ఆ ఆలోచన, క్రమంగా దేశమంతా వెలుగులు నింపే స్థాయికి చేరింది. నేడు ఆ కంపెనీ భారత్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది అంతా హితేష్ తీసుకున్న ఆ ఒక ధైర్యమైన నిర్ణయంతోనే ప్రారంభమైంది.
2025 మొదటి త్రైమాసికంలో, వారీ ఎనర్జీస్ భారత్లో అతిపెద్ద సోలార్ మాడ్యూల్ సరఫరాదారుగా నిలిచింది. ఆ సమయంలో దేశంలో మొత్తం సోలార్ మాడ్యూల్ షిప్మెంట్లలో సుమారు 17.3% భాగం వారీ ద్వారా సరఫరా అయ్యింది. అంటే, భారత్లో ప్రతి 100 సోలార్ ప్యానెల్స్లో సుమారు 17 ప్యానెల్స్ వారీ నుంచి వచ్చాయి. ఈ విజయము కంపెనీ భరోసా మరియు నమ్మకాన్ని ప్రదర్శిస్తుంది, అలాగే ఇండియాలో స్థానికంగా తయారైన సోలార్ పరికరాలపై డిమాండ్ పెరుగుతున్నదాన్ని చూపిస్తుంది. ఇది భారత్ లో రీన్యూయబుల్ ఎనర్జీ విస్తరణలో వారీకి కీలక స్థానాన్ని అందిస్తోంది.
ఇప్పుడు వారీ గ్రూప్కు 12,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కంపెనీ ఆదాయంలో ఎక్కువ భాగం అమెరికాకు ఎగుమతుల ద్వారా వస్తోంది. ఒకప్పుడు 5,000 రూపాయల అప్పుతో మొదలైన ఈ ప్రయాణం, నేడు 400 కోట్ల విలువైన సామ్రాజ్యంగా మారిపోయింది. ఇప్పుడు 58 ఏళ్ల హితేష్ చిమన్లాల్ దోషీ కేవలం విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు కలలు కనేవారికి నిజమైన ప్రేరణ అని మనందరికీ చెబుతుంది. ప్రారంభం చిన్నదైనా, దిశ సరైనదైతే విజయం పెద్దదే అవుతుంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications