చారిత్రాత్మక స్మారక చిహ్నం తాజ్ మహల్ ప్రాంగణంలోకి నేటి నుంచి ఆగస్టు 15 వరకు సందర్శకులందరికీ ప్రవేశం ఉచితం అని భారత పురావస్తు శాఖ (ASI) శుక్రవారం తెలిపింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అన్ని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా-రక్షిత స్మారక చిహ్నాలను ఆగస్టు 5 నుంచి ఆగస్టు 15 వరకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

3,793 ప్రాంతాలు
ASI ట్విట్టర్లో ఇలా పేర్కొంది, " 13 ఆగస్టు 2022 నుండి 15 ఆగస్టు 2022 వరకు సందర్శకులందరినీ
తాజ్లోకి ఉచితంగా అనుమతిస్తాం. దేశవ్యాప్తంగా మొత్తం 3,793 ASI-రక్షిత సైట్లు ఉన్నాయి. ఈ సందర్శక ప్రాంతాలకు ఆగస్ట్ 15 వరకు ఎటువంటి సందర్శకులకు ప్రవేశ రుసుము వసూలు చేయవని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

కిషన్ రెడ్డి ట్వీట్..
"'ఆజాదీ కా #అమృతమహోత్సవ్', 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా సందర్శకులకు స్మారక చిహ్నాలు/స్థలాలకు ప్రవేశం ఉచితం. దేశంలో, 2022 ఆగస్టు 5 నుండి 15వ తేదీ వరకు ఎలాంటి రుసుం వసూలు చేయరు" అని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. దీన్ని రీట్వీట్ చేసిన ASI," స్మారక స్థలాలు వెళ్లేవారికి ఆగస్టు15 వరకు ఉచిత ప్రవేశం ఉంటుందని పేర్కొంది.

జాతీయ జెండాలు
ఆగ్రాలో, ASI తాజ్ మహల్, ఫతేపూర్ సిక్రీ, ఇత్మద్-ఉద్-దౌలాతో సహా దాదాపు 40 స్మారక చిహ్నాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసింది. ఆగ్రాలోని వివిధ స్మారక చిహ్నాలలో ప్రదర్శనలు, జాతీయ జెండాలను ఏర్పాటు చేయనుంది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం చేపట్టింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications