దేశంలో మొట్టమొదటి ప్రైవేట్గా అభివృద్ధి చేసిన రాకెట్ విక్రమ్-S నవంబర్ 12, 16 మధ్య ప్రయోగానికి సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ మంగళవారం ప్రకటించింది. స్కైరూట్ ఏరోస్పేస్ యొక్క తొలి మిషన్'ప్రారంభ్' (ప్రారంభం) అని పేరు పెట్టారు. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లాంచ్ప్యాడ్ నుంచి ఈ రాకెట్ ను ప్రయోగం చేయనున్నారు. నవంబర్ 12, 16 మధ్య ప్రయోగ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా తుది తేదీని ప్రకటిస్తామని స్కైరూట్ ఏరోస్పేస్ CEO, సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన తెలిపారు.

స్కైరూట్ ఏరోస్పేస్
ఈ మిషన్తో, స్కైరూట్ ఏరోస్పేస్ భారతదేశంలోని అంతరిక్షంలోకి రాకెట్ను ప్రయోగించిన మొదటి ప్రైవేట్ స్పేస్ కంపెనీగా అవతరించనుంది. ఇది ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి ఉపయోగపడనుంది. విక్రమ్-ఎస్ రాకెట్ అనేది ఒకే-దశ ఉప-కక్ష్య ప్రయోగ వాహనం, ఇది మూడు కస్టమర్ పేలోడ్లను కలిగి ఉంటుందట. విక్రమ్ సిరీస్ స్పేస్ లాంచ్ వెహికల్స్లోని మెజారిటీ టెక్నాలజీలను పరీక్షించడానికి సహాయపడుతుందని స్కైరూట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నాగ భరత్ డాకా ఏరోస్పేస్ ఒక ప్రకటనలో తెలిపింది.

ISRO, IN-SPAce
ISRO, IN-SPAce (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) నుంచి మద్దతు ఉన్నందున స్కైరూట్ ఇంత తక్కువ సమయంలో విక్రమ్-ఎస్ రాకెట్ మిషన్ను నిర్మించి, సిద్ధం చేశామని చందన చెప్పారు. భారతీయ అంతరిక్ష కార్యక్రమ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్కు నివాళిగా స్కైరూట్ ప్రయోగ వాహనాలకు 'విక్రమ్' అని పేరు పెట్టారు.

స్కైరూట్
హైదరాబాద్లో ఉన్న స్కైరూట్ వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు అత్యాధునిక అంతరిక్ష ప్రయోగ వాహనాలను నిర్మిస్తోంది. అంతరిక్షయానాలను సరసమైనదిగా, విశ్వసనీయంగా, అందరికీ సక్రమంగా అందించాలనే లక్ష్యంతో వ్యయ-సమర్థవంతమైన ఉపగ్రహ ప్రయోగ సేవలు తమ లక్ష్యమని ఒక ప్రకటనలో తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications