నామినీలకు సంబంధించి కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గత శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం బ్యాంకింగ్ చట్టాల్లో కొన్ని మార్పులు చేసింది. ఒక వ్యక్తి బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు కలిగి ఉంటే.. అతను నలుగురు నామినీలుగా ఉంచాలని నిర్ణయించింది. క్లెయిమ్ చేయని డిపాజిట్ల పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 2024 నాటికి మన దేశంలోని అన్ని బ్యాంకుల క్లెయిమ్ చేయని మొత్తం రూ.78,000 కోట్లు.
డిపాజిటర్ చనిపోయినప్పుడు లేదా ఇతర కారణాల వల్ల డబ్బు తీసుకోలేక చాలా మంది డిపాజిటర్ కుటుంబాలు, ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని అరికట్టేందుకు బ్యాంకింగ్ చట్టంలో పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం ఒక నామినీని మాత్రమే అనుమతి ఇస్తున్నాయి. ఇదే సమయంలో బీమా ఖాతాల నుంచి డబ్బును విత్డ్రా చేయడంలో కొన్ని సంస్కరణలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో ఎక్కువ మంది నామినీలు ఉండవచ్చని నిర్ణయించినప్పటికీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాతే ఈ నిబంధనల వివరాలు స్పష్టంగా తెలియనున్నాయి. ఈ పథకంపై ప్రభుత్వ అధికారులు మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల పై ఆందోళన వ్యక్తం చేశారు.
కొన్ని బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టిన రోజులలోపు వ్యక్తులు మరణించినప్పుడు, నిధులు క్లెయిమ్ చేయకుండా బ్యాంకులో ఉంటాయి. మార్చి నాటికి 78,000 కోట్లు క్లెయిమ్ చేయలేదు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications