చమురు మార్కెటింగ్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్రోలియం క్రూడ్ పై విధించే విండ్ఫాల్ పన్నును కేంద్రం రద్దు చేసింది. విండ్ ఫాల్ ట్యాక్స్ రద్దు నేటి నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఈ సమాచారం అందింది. గత ఏడాది జులైలో తొలిసారిగా ప్రభుత్వం ఈ విండ్ఫాల్ ట్యాక్స్ను విధించింది. అప్పటి నుంచి ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.
ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై విండ్ ఫాల్ ట్యాక్స్ లేదు. ప్రతి 15 రోజులకు, చమురు ధరల హెచ్చుతగ్గుల ఆధారంగా, ప్రభుత్వం చమురుపై విండ్ఫాల్ పన్నును సమీక్షించి మారుస్తుంటుంది. మే 1న ప్రభుత్వం పెట్రోలియం క్రూడ్పై విండ్ఫాల్ ట్యాక్స్ను టన్నుకు రూ.4100కి తగ్గించింది. దీనిని డాలర్ రూపంలో టన్నుకు $50.14గా ఉంచారు.

ఏప్రిల్ 19న క్రూడ్పై టన్నుకు రూ.6400 లెవీ పెంచారు. ఏప్రిల్ 4 న, ప్రభుత్వం క్రూడ్పై విండ్ఫాల్ పన్నును టన్నుకు రూ. 3500 నుంచి పూర్తింగా తగ్గించింది. వాస్తవానికి, ప్రైవేట్ రిఫైనరీలు ఈ పెట్రోలియం ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడం ద్వారా ఎక్కువ లాభం పొందుతున్నాయి మరియు దేశీయ మార్కెట్కు బదులుగా చమురు ఉత్పత్తులను విక్రయించడానికి ప్రయత్నిస్తున్నాయి, దీనిని తగ్గించడానికి ప్రభుత్వం ఈ విండ్ఫాల్ పన్ను విధించింది.
అంతేకాకుండా రష్యా నుంచి తక్కువ ధరకు చమురును దిగుమతి చేసుకుని ఎక్కువ ధరకు విదేశాలకు విక్రయించి లాభాలు పొందుతున్నారు. అయితే విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గించడం వల్ల చమురు మార్కెటింగ్ సంస్థలకు లాభమని.. ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం ఉండదని కొందరు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications