ట్రంప్కు భారీ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. కొత్త రాజకీయ పార్టీతో అమెరికాను ఏలేద్దామంటూ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..స్సేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. యూఎస్ ఎన్నికల సమయంలో పురివిప్పిన వీరి స్నేహం క్రమంగా మసకబారుతోంది. ఇద్దరి మధ్యా మాటల యుద్ధం కొనసాగుతోంది. వీరి స్నేహం ఇప్పుడు శత్రుత్వంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.తాజాగా ఎలోన్ మస్క్ డోనాల్డ్ ట్రంప్ గొడవ తర్వాత కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నారా? అనే దానికి సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టులు ఊతమిస్తున్నాయి.
అమెరికాలో కొత్త పార్టీ అవసరమా అని నిర్ణయించమని ప్రజలను కోరుతూ Xలో ఒక పోల్ను పోస్ట్ చేశాడు ఎలోన్ మస్క్. అమెరికాలో ప్రజల స్పందన ఎలా ఉందో తెలుసుకోవడానకి మస్క్ ఈ పోల్ నిర్వహించారు.అమెరికాలో కొత్త పార్టీ అవసరమా అని నిర్ణయించమని ప్రజలను కోరుతూ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో వేసిన పోస్టుకు విపరీతమైన ఆదరణ లభించింది. ఏకంగా 80 శాతం మంది ప్రజలు ఈ పోల్కు మద్దతు ఇచ్చారని మస్క్ తెలిపారు.

అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరమని 80% మంది ప్రజలు తీర్పునిచ్చారు. కాబట్టి కొత్త రాజకీయ పార్టీకి "ది అమెరికా పార్టీ" అని పేరు పెడుతున్నట్లుగా ప్రకటించారు. అయితే అమెరికాలో తరతరాలుగా పాతుకుపోయిన రెండు పార్టీల వ్యవస్థను ఎలోన్ మస్క్ సవాలు చేయగలడో లేదో చెప్పడం కష్టమే. అయితే అమెరికాలో 1950 లో డెమోక్రటిక్, రిపబ్లిక్ పార్టీలు కాని వ్యక్తి అధ్యక్షుడయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ కి కూడా అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి అది జరుగుతుందా.. అసలు ఎలోన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నారా అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. వీరి యుధ్దాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకిస్తూ కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. వీరి స్నేహం చెడిపోవడానికి ప్రధాన కారణం అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక బిల్లు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బిల్లును నాకు తెలియకుండా ఎలా ఆమోదిస్తారని ఎలాన్ మస్క్ అడగంతో గొడవ మరింత పెద్దదైనట్లు సమాచారం. నేను ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఖర్చులతో పాటు పన్నులను తగ్గించే బిల్లు మీద మాట మాత్రమైనా చెప్పలేదని ఎలాన్ మస్క్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.
The America Party https://t.co/hO5S8Kjb5O
— Elon Musk (@elonmusk) June 6, 2025
జూన్ 5న మొదలైన ఈ వార్ మరింతగా ముదురుతోంది. అయితే ఈ యుద్ధ సునామి టెస్లా షేర్లను తాకింది. జూన్ 5న కంపెనీ షేర్లు 14 శాతం పడిపోయాయి. ఏకంగా టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ 152 బిలియన్ డాలర్లకు కుప్పకూలింది. దీంతో టెస్లా వాటాదారులు భారీ నష్టాలను మూటగట్టుకున్నారు.ఈ నేపథ్యంలోనే టెస్లా వాటాదారులు కంపెనీపై శ్రద్ధ చూపాలని పట్టుబట్టారు.
దీంతో మస్క్ కంపెనీ మీద ఫోకస్ పెట్టడానికి ట్రంప్ నుండి దూరం జరుగుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత నష్టం వచ్చినా.. టెస్లా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా ఉంది. బుధవారం నాటికి, టెస్లా మార్కెట్ విలువ దాదాపు 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది, ఇది టయోటా మోటార్ 290 బిలియన్ల డాలర్ల కంటే చాలా ఎక్కువ.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.