ఎలక్ట్రిక్ వాహనాలను భారత్లో తయారు చేస్తే ఈ వాహనాలు తయారు చేసే టెస్లాకు కూడా ప్రయోజనకరమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశంలో పెట్రోల్ వాహనాల ధర కంటే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తక్కువగా ఉండే రోజులు మరెంతో కాలం లేదన్నారు. ఆ రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ తన ఎలక్ట్రిక్ వాహనాలను చైనాలో తయారు చేసి, భారత్లో విక్రయిస్తామని భావిస్తున్నారు. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఇక్కడే తయారు చేయాలని చెబుతోంది.
దేశంలో పెట్రోల్ వాహనాల వ్యయంతో పోలిస్తే అన్ని విద్యుత్ వాహనాల ధరలు తక్కువకు లభించే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు గడ్కరీ. ఎలాన్ మస్క్ భారత్లో తయారీకి సిద్ధంగా ఉంటే తమకు సమస్య లేదన్నారు. ఇక్కడ తయారీ ప్రారంభిస్తే చాలా ప్రయోజనమని, భారత్ చాలా పెద్ద మార్కెట్ అని, భారత్ నుండి ఎగుమతులు కూడా చేసుకోవచ్చునని చెప్పారు. కానీ చైనా నుండి మాత్రం కార్లను దిగుమతి చేసుకోరాదన్నారు.

ముందుగా భారత్లో తయారీని ప్రారంభిస్తేనే ఏవైనా పన్ను మినహాయింపులు పరిశీలిస్తామని గతంలోనే గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం పూర్తిగా తయారైన వాహనాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ 60 శాతం నుండి 100 శాతంగా ఉంది. ఇంజిన్ పరిమాణం, వ్యయం, ఇన్సురెన్స్, ట్రాన్సుపోర్ట్ వ్యాల్యూ ఆధారంగా ఉంది. 40,000 డాలర్లకు పైగా ఉండే వాహనాలపై దిగుమతి సుంకం 110 శాతంగా ఉందని, ఇది ఉద్గారరహిత వాహనాలపై నిషేధం విధించడం వంటిదని గతంలో టెస్లా పేర్కొంది. విద్యుత్ కార్లపై టారిఫ్ను 40 శాతానికి చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సీఎస్ఆర్ను కూడా ఉపసంహరించారలని కోరింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications