ఎలాన్ మస్క్ కార్ల కంపెనీ 'టెస్లా' ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా లాంఛ్ చేసిన 'సైబర్ట్రక్' త్వరలోనే దుబాయ్ పోలీసుల వాహన శ్రేణిలో చేరనుంది. ఈ ఎలక్ర్టిక్ పికప్ ట్రక్ 2020లో తమ అధికారిక వాహన శ్రేణిలో చేరబోతోందని తెలుపుతూ దానిపై తమ లోగోలను ముద్రించిన ఫోటోను ట్విటర్లో దుబాయ్ పోలీసులు పోస్ట్ చేశారు. దుబాయ్ పోలీసుల వాహన శ్రేణిలో చేరిన ఘనతను సాధించిన తొలి టెస్లా కారుగా 'సైబర్ట్రక్' రికార్డు సృష్టించింది.
ఇప్పటికే దుబాయ్ పోలీసులు తమ వాహన శ్రేణిలో.. బుగాట్టి వెర్యాన్, ఆస్టన్ మార్టిన్ వన్-77, బీఎండబ్ల్యూ ఐ8, ఫెరారి లాఫెరారి, లాంబోర్గిని అవెంటడార్, లైకాన్ హైపర్స్పోర్ట్ వంటి కార్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా వీరి వాహన శ్రేణిలో టెస్లా కంపెనీకి చెందిన 'సైబర్ట్రక్' కూడా వచ్చి చేరనుంది.

అత్యంత దృఢమైన ట్రక్ అన్నారు, కానీ...
గత గురువారమే టెస్లా తన 'సైబర్ట్రక్'ను అట్టహాసంగా లాంఛ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ దానిని ఆవిష్కరిస్తూ.. తమ కొత్త వాహనం చాలా గట్టిదని వ్యాఖ్యానిస్తూ.. కావాలంటే మీ సమక్షంలోనే ఈ ట్రక్ దృఢత్వాన్ని పరీక్షిస్తామంటూ సవాల్ విసిరారు. దీంతో ఆ కార్యక్రమానికి విచ్చేసిన అహూతులు ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ ట్రక్ను డిజైన్ చేసిన డిజైనర్ స్వయంగా వేదికపై ఆ ట్రక్ దృఢత్వాన్ని పరీక్షించారు.
తొలుత గొడ్డలితో ట్రాక్ డోర్పై బలంగా మోదగా ఆ ట్రక్ డోర్ కించిత్ కూడా డ్యామేజ్ కాలేదు.దీంతో అక్కడున్నవారందరూ చప్పట్లు కొట్టారు. దాని అద్దం కూడా చాలా గట్టిదని, ఎంత కొట్టిన పగలదని మళ్లీ ఎలాన్ మస్క్ ప్రకటించగా.. సదరు డిజైనర్ ఓ మెటల్ బాల్ తీసుకుని అద్దంపైకి విసిరారు. అద్దమైతే భళ్లున బద్దలుకాలేదు కానీ, క్రాక్ ఇచ్చింది. దీంతో సీఈవో ఎలాన్ మస్క్ విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది.
నాలుగు రోజుల్లోనే 1.87 లక్షల ఆర్డర్లు...
దృఢత్వం విషయంలో కాస్తంత నిరాశపరిచినా టెస్లా కంపెనీ విడుదల చేసిన 'సైబర్ట్రక్'కు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఈనెల 22న టెస్లా సైబర్ట్రక్ను లాంఛ్ చేయగా కేవలం నాలుగు రోజుల్లోనే 1.87 లక్షల ఆర్డర్లు వచ్చాయి. 2020లో టెస్లా ఉత్పత్తిని ప్రారంభించనున్న ఈ ఎలక్ర్టిక్ పికప్ ట్రక్.. సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్, ట్రై మోటార్ అంటూ మూడు వేరియంట్లలో లభిస్తుంది.
సైబర్ ట్రక్ సింగిల్ మోటార్ ధర రూ.30 లక్షలు కాగా, డ్యూయల్, ట్రై వేరియంట్లు వరుసగా రూ37.45 లక్షలు, రూ 52.42 లక్షలు. సెల్ప్ డ్రైవింగ్ ఆప్షన్ (డ్రైవర్ లేకుండా కారు దానంతట అదే పరుగులు పెడుతుంది) కోసం అదనంగా రూ.5 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇక 42 శాతం కస్టమర్లు డ్యూయల్ మోటార్ ట్రక్ను, 41 శాతం ట్రై మోటార్ ట్రక్ను బుక్ చేసుకోగా, 17 శాతం మంది సింగిల్ మోటార్ వేరియంట్ ట్రక్ బుక్ చేసుకున్నట్లు టెస్లా ఒక ప్రకటనలో తెలిపింది.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications