బెంగుళూరులో ఇంటి యజమానులు నిలువు దోపిడి, తట్టుకోలేక అద్దెదారులు ఏం చేస్తున్నారంటే..

భారతదేశ ఐటీ రాజధాని బెంగుళూరులో ఇల్లు అద్దెకు దొరకాలంటే జేబులు డబ్బులు ఎక్కువగా వదలాల్సిందే.. నగరంలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాలంటే ఉద్యోగి భయపడే పరిస్థితులు బెంగుళూరు నగరంలో ఉన్నాయి. అందుకుని ఎక్కువ శాతం ఉద్యోగులు పీజీల్లో ఉండేందుకు మొగ్గు చూపుతుంటారు. వీకెండ్ సమయాల్లో ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. మరి అంతలా ఎందుకు భయపడుతున్నారంటే.. చాలానే కారణాలు ఉన్నాయి.

సిలికాన్ సిటీలో ఇల్లు దొరకడం చాలా కష్టం. ఒకవేళ ఇల్లు అద్దెకు దొరికినా ముందుగా ఆరునెలల అడ్వాన్స్ యజమానికి ఇవ్వాలి.దీంతో పాటు సెక్యూరిటీ కింద మరికొంత ఇవ్వాల్సి ఉంటుంది.ఇక మెయింటెనెన్స్ ఇతరత్రా ఖర్చులు కలుపుకుంటే నెలకు వచ్చే జీతంలో సగభాగం ఇంటికే పోతుంది. దీంతో ఉద్యోగి జేబుకు గట్టిగానే చిల్లులు పడే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు ఇల్లు తీసుకోవడం వదిలేసి పీజీల్లో ఉంటున్నారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మార్చారు. బెంగుళూరు నగరంలో ఉద్యోగులు ట్రెండ్ ను మార్చారంటూ సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి.

Bengaluru property investment tenants buying homes high rent Bengaluru rental exploitation real estate trends 2025 Bengaluru rental crisis tenants vs landlords rent hike Bengaluru Bengaluru housing market rental pressure affordable housing Bengaluru tenants turning investors 2025

ఇంతకీ ట్రెండ్ ఏం మార్చారంటే..ఇల్లు అద్దెకు తీసుకుని తంటాలు పడే బదులు ఆ డబ్బుతో సొంతిళ్లు కొనుక్కోవచ్చని ఆలోచన చేస్తున్నారు. ఒకప్పుడు అద్దె ఇల్లు ఎంతో బెస్ట్ అని భావించిన వారంతా ఇప్పుడు అద్దె ఇల్లు వదిలేసి సొంతిల్లు ప్లాన్ చేస్తున్నారు. అద్దె ఖర్చులు, ఆరు నెలల అడ్వాన్స్, సెక్యూరిటీ డిపాజిట్లు ఇవన్నీ కలుపుకుంటే అయ్యే మొత్తంతో ఇల్లు కొనుగోలు చేయవచ్చనే ప్లాన్ ఉద్యోగులు బెంగుళూరు నగరంలో చేస్తున్నారు.

దీనికి ఇంకా అనేక కారణాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక పోస్టులో యజమాని రూ. 500 ఖరీదు చేసే ల్యాంప్ కోసం రూ.2500 డిపాజిట్లో తగ్గించుకున్నాడని అద్దెదారు వాపోయారు. ఈ ఘటన రామనగొండ హళ్లిలో చోటు చేసుకున్నట్లు పోస్టులో తెలిపారు. ఈ పోస్టులో అద్దె దారు ఇల్లు ఖాళీ చేయాలని యజమానికి చెప్పి డిపాజిట్ తిరిగి ఇవ్వాలని అడిగితే.. యజమాని చెప్పిన దానికి ఒక్కసారిగా షాకయ్యాడు.ఆ వస్తువు పాడయిపోయింది. ఈ వస్తువు పాడయిపోయింది అంటూ.. డిపాజిట్ నుండి దాదాపు లక్షరూపాయలు జమ చేసుకున్నాడని వాపోయారు. నిజానికి అన్ని వస్తువులు బాగున్నా యజమాని పాడయిపోయాయంటూ డిపాజిట్ నుండి ఈ మొత్తాన్ని రికవరీ చేసుకున్నాడని వాపోయాడు.

ఇక మరొక పోస్టులో పెయింటింగ్ ఛార్జీలు మా ఇంటి యజమాని దారుణంగా వసూలు చేశాడంటూ ఓ అద్దెదారు వాపోయారు. ఇంటిలో చేరే సమయంలో వాల్ పేపర్లు అంటించాడని..అయితే ఆ తరువాత ఇల్లు ఖాళీ చేసే సమయంలో వాటిని చించివేసేసరికి పెయింటింగ్ పాడపోయిందన్నారు. దానికి పెయింటింగ్ వేసినందుకు అద్దె దారు నుంచి యజమాని దాదాపు లక్షా యాభై వేల రూపాయలు వసూలు చేశాడని వాపోయాడు. ఈ నేపథ్యంలోనే అందరూ బెంగుళూరు నగరంలో అద్దెకు ఉండటం కంటే ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+