VI Stock: చాలాకాలంగా దేశీయ టెలికాం రంగంలో అతిపెద్ద పోటీ కొనసాగుతోంది. ఈ క్రమంలో జియో ధాటికి ప్రముఖ టెలికాం కంపెనీలైన వొడఫోన్, ఐడియాలు ఒక్కటి కావాల్సి వచ్చింది. ఆదిత్యా బిర్లా గ్రూప్ టెలికాం సంస్థ పెద్ద సంఖ్యలో యూజర్లను కలిగి ఉన్నప్పటికీ 4జీ, 5జీ విస్తరణలో కొంత వెనుకపడిన మాట నిజమే. అక్కడి నుంచే కంపెనీ అనేక కష్టాలను ఎదుర్కొంటూ పతనాన్ని చూడటం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది వొడఫోన్ ఐడియా లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. ఒకప్పుడు దేశంలో వెలుగువెలిగిన ఈ సంస్థ ప్రస్తుతం టెలికాం రంగంలో నిలదొక్కుకునేందుకు పెద్దస్థాయిలో ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు సెప్టెంబర్ మాసంలో దాదాపు 33 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఈ క్రమంలో అక్టోబర్ 2019 తర్వాత కంపెనీ షేర్లు భారీగా క్షీణతను చూడటం ఇదే తొలిసారి. దీంతో కేవలం సెప్టెంబరు నెలలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.34,000 కోట్లకు పైగా క్షీణతను చూటంతో ఇన్వెస్టర్లు భారీగా తమ సంపదను కోల్పోయారు. అయితే నెల చివరి రోజైన సెప్టెంబర్ 30న ఒక్కో షేరు రూ.10.36 వద్ద తన ప్రయాణాన్ని ముగించింది.

సెప్టెంబరు నెల ప్రారంభ సమయంలో విఐ స్టాక్ ధర ఒక్కోటి దాదాపు రూ.15.64 వద్ద ఉండగా నెల చివరి రోజు నాటికి అది దాదాపు 33 శాతం క్షీణతను చూడటంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ లక్ష కోట్ల స్థాయి నుంచి రూ.72 వేల కోట్లకు దిగజారింది. గత నెలలో టెలికాం దిగ్గజం ఏజీఆర్ బకాయిలను తిరిగి లెక్కించాలంటూ వేసిన పిటిషన్ సుప్రీం ధర్మాసనం తిరస్కరించిన తర్వాత స్టాక్ భారీ పతనాన్ని నమోదు చేసింది. అయితే ఈ తీర్పుతో వోడాఫోన్ ఐడియా నగదు ప్రవాహ సవాళ్లు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ ఐఐఎఫ్ఎల్ అభిప్రాయపడింది. అయితే కంపెనీ ఇటీవలి కాలంలో వేగంగా సేవల విస్తరణను కొనసాగించేందుకు రుణ సేకరణకు ప్రయత్నిస్తున్న సమయంలో కోర్టు నుంచి ప్రతికూల తీర్పు రావటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు.
వొడఫోన్ ఐడియా షేర్లు గత ఆరు నెలల కాలంలో 25%, 2024లో ప్రారంభం నుంచి ఇప్పటివరకు 38% క్షీణతను నమోదు చేశాయి. అలాగే ఏడాది ప్రాతిపదికన 13% క్షీణతను నమోదు చేసింది. దీర్ఘకాలంలో కంపెనీ షేర్ల పనితీరును పరిశీలిస్తే.. ఐదేళ్లలో 105% వరకు వృద్ధిని సాధించింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లకు 52 వారాల గరిష్ఠ ధర రూ.19.15 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.9.79గా ఉంది. అలాగే కంపెనీ ఏజీఆర్ డ్యూస్ కింద గతంలో ప్రభుత్వానికి వాటాలను అందించిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీలో ప్రభుత్వ వాటా 23.15 శాతంగా ఉంది. ఇదే క్రమంలో విదేశీ పెట్టుబడిదారు GQG భాగస్వాములు 2.17 శాతం వాటాను కలిగి ఉన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications