Airtel Q4 Results: దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ నేడు తన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,072 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే నికర లాభం 31.1 శాతం క్షీణతను నమోదు చేసింది.
జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర ఆదాయం రూ.37,599 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే టెలికాం దిగ్గజం ఆదాయం 4.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ కాలంలో ఆఫ్రికన్ కరెన్సీల విలువ తగ్గింపు ప్రభావం ముఖ్యంగా నైజీరియన్ నైరా ఆదాయాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. వాస్తవానికి మార్కెట్ వర్గాల అంచనాల కంటే కంపెనీ త్రైమాసిక ఫలితాలు తక్కువగా నమోదైంది. మార్కెట్ వర్గాలు నికర లాభం రూ.2,201 కోట్ల నుంచి రూ.5,309గా అంచనా వేశారు.

మార్చి త్రైమాసికంలో కంపెనీ భారత ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12.9 శాతం పెరిగి రూ.28,513 కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో కంపెనీ బలమైన 4G/5G కస్టమర్ జాయినింగ్స్ ఆదాయ వృద్ధి నమోదైంది. ఇదే క్రమంలో ఏకీకృత మొబైల్ డేటా ట్రాఫిక్ 26.2% ఆరోగ్యకరమైన వృద్ధితో ఏడాది ప్రాతిపదికన త్రైమాసికంలో 17,702 బేసిస్ పాయింట్ల వద్ద ఉంది.
సునీల్ మిట్టల్ నేతృత్వంలోని టెల్కో కంపెనీ యజమానులకు రూ.3,005 కోట్ల ఏకీకృత పన్ను తర్వాత లాభాన్ని నమోదు చేసింది. నేడు మార్కెట్ల ముగింపు సమయంలో ఎయిర్టెల్ షేర్లు దాదాపు రూ.1,287 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. కంపెనీ త్రైమాసికంలో టవర్ల సంఖ్యను భారీగా పెంచింది.
టెలికాం దిగ్గజం 7.8 మిలియన్ల స్మార్ట్ఫోన్ కస్టమర్లను పొందింది. అలాగే కంపెనీ ఒక్కో కస్టమర్ నుంచి వచ్చే సగటు ఆదాయం ఏడాది కిందట మార్చి త్రైమాసికంలో రూ.193 ఉండగా అది ప్రస్తుతం రూ.209కి పెరిగి ఇండస్ట్రీలో అగ్రగామి ఆదాయాన్ని నమోదు చేసింది. దీంతో కంపెనీ నేడు ఫలితాల ప్రకటనలో ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.8 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.
ఈ త్రైమాసికంలో టెల్కో భారతదేశ సబ్స్క్రైబర్ బేస్ 2.4% పెరిగి 406 మిలియన్లకు చేరుకుంది. నైజీరియన్ నైరా విలువ తగ్గటం ఏకీకృత పనితీరు ప్రధానంగా ప్రభావితమైందని కంపెనీ ఎండీ గోపాల్ విట్టల్ చెప్పారు. కంపెనీ గత సంవత్సరం కంటే 28.6 మిలియన్ల 4G/5G డేటా కస్టమర్లను తన నెట్వర్క్కు జోడించి 12.8% వృద్ధిని నమోదు చేసింది. మెుత్తానికి ఎయిర్ టెల్ ఏడాదికి 14.1% ఆదాయ వృద్ధిని అందించింది. అలాగే డిజిటల్ టీవీ వ్యాపారం త్రైమాసికంలో 6% వృద్ధి చెందింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications