Layoffs in Telecom: గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దిగ్గజ కంపెనీలు మొదలు స్టార్టప్స్ వరకు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించి షాక్ ఇస్తూనే ఉన్నాయి. అయితే ట్విట్టర్ టేకోవర్ సమయంలో ఎలాన్ మస్క్ వీడియో కాల్లోనే సిబ్బందికి ఉద్వాసన పలికినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి నిమిషాల వ్యవధిలో కాల్లోనే అకస్మాత్తుగా లేఆఫ్స్ ఇవ్వడం సాధారణమైపోయింది.
ఇటీవల 7 నిమిషాల కాల్లో ప్రముఖ టెక్ దిగ్గజం IBM ఉద్యోగులపై వేటు వేసింది. తాజాగా కెనడాకు చెందిన టెలీకమ్యూనికేషన్స్ దిగ్గజం బెల్ కూడా ఇదే పద్ధతిని అనుసరించింది. వర్చువల్ గ్రూప్ సమావేశాలలో 400 మందికి పైగా కార్మికులను తొలగించింది. దీంంతో ఆ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ ఇది అవమానకర చర్య అంటూ కంపెనీ తీరును ఖండించింది.

పది నిమిషాల వీడియో కాల్లలో తొలగించబడిన ఉద్యోగులను 'మిగులు'గా ప్రకటించబడనట్లు సమాచారం. ఎవరినీ ప్రశ్నలు అడగడానికి అనుమతించకుండా మేనేజర్ లేఆఫ్ నోటీసును చదివినట్లు బాధితులు పేర్కొన్నారు. ఏళ్ల తరబడి కంపెనీకి తమ సభ్యులు చేసిన సేవకు రివార్డుగా పింక్ స్లిప్లు ఇచ్చి తొలగిస్తున్నారని యునిఫోర్ క్యూబెక్ డైరెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సంస్థ నిర్వహణ సులభతరంతో పాటు పరివర్తనను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు బెల్ CEO మిర్కో బిబిక్ ఫిబ్రవరిలోనే స్పష్టం చేశారు. అవసరమైన మేర కోతలు విధించేందుకు 4 వేల 800 ఉద్యోగులను అంటే కంపెనీ శ్రామికశక్తిలో దాదాపు 9 శాతం మందికి ఉద్వాసన పలికేందుకు ముందుగానే ప్రణాళికలు ప్రకటించింది. అయితే అదే సమయంలో వాటాదారులకు డివిడెండ్ చెల్లింపును పెంచడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications