తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ప్రైవేట్ వాహనాల ఛార్జీల బాదుడు.. కిటకిటలాడుతున్న హైదరాబాద్ మెట్రో..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు ఫలించకపోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉధృత రూపం దాల్చింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు సమ్మెకు దిగడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, బీహెచ్‌ఈఎల్ వంటి కీలక డిపోలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన కేంద్రాల్లో ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసనలు చేపట్టారు. బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా కార్మికులు అడ్డుకోవడంతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ కుప్పకూలింది.

సమ్మె నేపథ్యంలో పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులకు, కార్మికులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సంగారెడ్డిలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పోలీసుల పహారాలో బస్సులను నడపడానికి ప్రయత్నించగా, కార్మికులు వాటిని తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలో పటాన్‌చెరు వద్ద నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. భారీ భద్రత నడుమ కొన్ని బస్సులను రోడ్లపైకి తెచ్చినప్పటికీ, కార్మికుల ఆందోళనల వల్ల పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి రాలేదు.

Telangana RTC strike RTC strike Telangana news Telangana transport strike TSRTC strike impact Telangana bus strike 2026 RTC employees strike Hyderabad transport disruption auto fare hike Telangana cab fare increase Hyderabad travel disruption Telangana public transport crisis Telangana Telangana RTC latest news bus services halted Telangana commuter problems Hyderabad ride fare surge Telangana

బస్సులు లేకపోవడంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన బస్టాండ్లు నిశ్శబ్దంగా మారగా, గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతున్నారు. సికింద్రాబాద్ వంటి రద్దీ ప్రాంతాల్లో RTC బస్సుల కొరత వల్ల మెట్రో రైళ్లు, సెట్విన్ బస్సులు, ఎంఎంటిఎస్ (MMTS) రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇదే అదనుగా భావించిన ఆటో రిక్షాలు, ప్రైవేట్ కార్ల నిర్వాహకులు ప్రయాణికుల నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రభుత్వం, జేఏసీ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో, ఈ సమ్మె ఎప్పుడు ముగుస్తుందో తెలియక జనం ఆందోళన చెందుతున్నారు.

Also Read

ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను వెంటనే విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ వ్యవస్థ పరిరక్షణతో పాటు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమ్మెను ఆపాలని ఆయన కోరారు. సమస్యలకు సమ్మె పరిష్కారం కాదని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

ఈ కమిటీకి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. మొత్తం 32 అంశాల్లో 29 సమస్యలు వెంటనే పరిష్కరించదగినవని ఆయన వివరించారు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు వంటి కొన్ని కీలక అంశాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చిస్తామని మంత్రి పొన్నం వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+