Telangana: రికార్డులు సృష్టిస్తున్న కంటి వెలుగు.. 25 రోజుల్లో 50 లక్షల మందికి లబ్ధి..
Kanti Velugu: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా కంటి పరీక్షలను అందిస్తోంది. అయితే గురువారం ఈ ప్రాజెక్టు మరో మైలురాయిని చేరుకుంది. మంచి ప్రజాదరణ పొందిన ఉచిత సామూహిక కంటి స్క్రీనింగ్ ప్రాజెక్ట్ కేవలం 25 రోజుల్లో 50 లక్షల మందికి స్క్రీనింగ్ పూర్తి చేసింది.
జనవరి 18న ముఖ్యమంత్రి KCR ఖమ్మంలో రెండవ దశ కంటి వెలుగు కార్యక్రామాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 16,533 ప్రాంతాల్లో 1.50 కోట్ల మందికి సేవలను అందించాలని లక్ష్యంగా ఇది కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత కంటి స్క్రీనింగ్ ప్రాజెక్ట్ అయిన కంటి వెలుగు రెండవ దశను జూన్ 15 నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం స్క్రీనింగ్ చేసిన 50 లక్షల మందిలో దాదాపు 34 లక్షల మందికి ఎలాంటి కంటి సమస్యలు లేనట్లు వైద్యులు గుర్తించారు. అంటే దాదాపు 68 శాతం మందికి కంటి చూపులో ఎలాంటి అనారోగ్యాలు గుర్తించలేదు. అయితే 13 లక్షల మందికి వైద్యం అవసరమని తేలింది. ఒకటి రెండు వారాల్లో స్క్రీనింగ్ క్యాంపులు ప్రాథమిక కంటి పరీక్షలు, ఆన్-సైట్ రీడింగ్ గ్లాసెస్ పంపిణీ, సాధారణ కంటి సంబంధిత వ్యాధుల నిర్ధారణ, ప్రిస్క్రిప్షన్ గ్లాసుల పంపిణీని కవర్ చేస్తాయి.

ఇప్పటి వరకు కంటి వెలుగు కింద మొత్తం 9.5 లక్షల మంది రీడింగ్ గ్లాసెస్ పొందారు. వైద్యం అవసరమైన 16 లక్షల మందిలో 6.5 లక్షల మంది ప్రిస్క్రిప్షన్ అద్దాలు పొందినట్లు ప్రాజెక్టు గణాంకాలు చెబుతున్నాయి. సాంకేతిక బృందం సిఫార్సు చేసిన ప్రిస్క్రిప్షన్ గ్లాసులు జిల్లాల్లోని లబ్ధిదారులకు ఆశా, ANMలు వంటి స్థానిక క్షేత్రస్థాయి ఆరోగ్య సంరక్షణ నిపుణుల ద్వారా పంపిణీ చేయబడతాయి. ప్రజలకు కంటి చూపు సమస్యలను దూరం చేయాలని సీఎం కేసీఆర్ చేపట్టిన కంటి వెలుగు మహాయజ్ఞంలా విజయవంతంగా ముందుకు సాగటంపై లబ్ధిదారులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications