తెలంగాణ బడ్జెట్‌.. ప్రాధాన్యతనిచ్చిన 5 కీలక రంగాలు ఇవే.. ప్రజా క్షేమం - సామాజిక న్యాయం లక్ష్యంగా..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో ప్రజా క్షేమం - సామాజిక న్యాయం అనే నినాదంతో ముందుకు వచ్చింది. ఈ బడ్జెట్‌లో సంక్షేమం, మౌలిక సదుపాయాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయం, విద్య, మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత తదితర రంగాలకు భారీ నిధులు కేటాయించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని పునరుద్ధరించడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.23,179 కోట్లు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. రైతు భరోసా, పంట బీమా, రుణమాఫీ పథకాలకు ముఖ్యంగా ప్రాధాన్యం ఇస్తూ.. రైతుల పెట్టుబడికి ఆర్థిక సహాయం అందించడానికి నిధులు కేటాయించారు. సన్న రకం వడ్లకు ప్రత్యేకంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ కూడా ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. ఈ చర్యలు రైతుల ఉత్పత్తి, భరోసా పెంపుకు దోహదపడతాయి.

Telangana Budget 2026 27 CM Revanth Reddy Telangana welfare schemes Telangana social justice Telangana agriculture funding Telangana education budget Telangana infrastructure development Telangana public welfare Telangana government allocations Telangana key budget highlights Telangana financial plan Telangana sector-wise allocation Telangana development initiatives Telangana 2026 budget news 2026 27 2026

విద్య, నైపుణ్యాభివృద్ధికి 26,674 కోట్లు కేటాయించింది. విద్యారంగానికి పెద్ద నిధులు కేటాయించి యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం, అంతర్జాతీయ ప్రమాణాలతో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. అదనంగా స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs), స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి సాధ్యం అవుతుంది.

ప్రజా పాలన - ఆరు గ్యారెంటీలకు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మహాలక్ష్మి (మహిళలకు ఉచిత బస్సు), గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్), రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి ఆరు గ్యారెంటీలకు అవసరమైన నిధులు ఈ బడ్జెట్‌లో కేటాయించబడ్డాయి. దీని ద్వారా పేద, మహిళా, వృద్ధ, వనరు వర్గాల వారికి సామాజిక భద్రతను పునరుద్ధరించడం లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.

మౌలిక సదుపాయాల కోసం రూ. 47,267 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో రోడ్లు, భవనాలు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడానికి ప్రధానంగా కేటాయించిన నిధులు, గత పాలనలో ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి వినియోగించబడ్డాయి. దీని ద్వారా రాష్ట్రానికి శాశ్వత ఆస్తులు సృష్టించి, ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ప్రజలకు సౌకర్యాలు అందించబడతాయి.

సామాజిక భద్రత - బీమా పథకాలకు కూడా బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కారు. ప్రతి పేద కుటుంబానికి ధీమా కల్పించేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకం ద్వారా రూ.5 లక్షల ప్రమాద బీమా అందించబడుతుంది. ఈ పథకం సురక్షితమైన భవిష్యత్తును నిర్ధారించడంలో కీలకంగా నిలుస్తుంది. 2026-27 తెలంగాణ Budget సామాజిక, ఆర్థిక, మౌలిక అభివృద్ధికి సమన్వయంగా రూపొంది, ప్రతి పౌరునికి సామాజిక న్యాయం, సంక్షేమం అందించడమే ప్రధాన దృష్టి అని చెప్పవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+